కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కరోనా మహమ్మారిని నివారించడానికి మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభించబడింది. లాక్ డౌన్ సమయంలో ఆటో, టాక్సీ మరియు బస్సుతో సహా అన్ని రకాల రవాణా సేవలు నిలిపివేయబడ్డాయి.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

అత్యవసర సమయంలో మాత్రమే ద్విచక్ర వాహనాలను మరియు కార్లకు అనుమతి కల్పించారు. కరోనా లాక్ డౌన్ నియమాలను ఉలంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులకు జరిమానాలు కూడా విధించారు. అనంతరం వాహన యజమానులను అరెస్టు చేశారు.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

2020 మే మొదటి వారంలో లాక్‌డౌన్ సడలించబడింది. అనేక పరిమితులతో వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించబడింది. కానీ లాక్ డౌన్ ఇప్పటికీ తమిళనాడులో అమలులో ఉంది. లాక్ డౌన్ ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది. అక్కడి పోలీసులు ఇంకా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

తమిళనాడులో ప్రయాణించే వాహనాలపై మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 24 నుండి ఆగస్టు 11 వరకు 140 రోజుల్లో తీసుకున్న చర్యలపై సమాచారం ఇప్పుడు విడుదలైంది.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

గత 140 రోజుల్లో మొత్తం 867,158 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇది తమిళనాడులో నమోదైన కేసుల సంఖ్య మాత్రమే. నిబంధనను ఉల్లంఘించిన 9,57,743 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

ఖైదీలను వ్యక్తిగత బెయిల్‌పై విడుదల చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి 6,77,629 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు పోలీసులు కరోనా లాక్ డౌన్ సమయంలో ఏకంగా రూ. 20.16 కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేశారు.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

తమిళనాడులో అంతర్ జిల్లా ప్రయాణానికి చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇ-పాస్ విధానం అమలులో ఉన్నప్పటికీ ప్రజలు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు ప్రయాణించలేరు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఈ-పాస్ విధానాన్ని రద్దు చేయలేదు.

కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

ఆగస్టు 1 నుంచి బస్సులను అనుమతిస్తామని ఇంతకు ముందు తమిళనాడు ప్రజలు ఆశించారు. అయితే బస్సులను అనుమతించలేదు. యథావిధిగా తమిళనాడులో బస్సులు ప్రారంభమవుతాయా లేదా అనేది ఇంకా తెలియలేదు.

గమనిక : ఇక్కడ ఫోటోలు కేవలం రెఫెరెన్స్ కోసం మాత్రమే

More from DriveSpark

Article Published On: Thursday, August 13, 2020, 12:56 [IST]
English summary
Lockdown norm violators paid more than Rs 20 crore fine. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+