Just In
- 14 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 15 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 17 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Movies యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా లాక్డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు
కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కరోనా మహమ్మారిని నివారించడానికి మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రారంభించబడింది. లాక్ డౌన్ సమయంలో ఆటో, టాక్సీ మరియు బస్సుతో సహా అన్ని రకాల రవాణా సేవలు నిలిపివేయబడ్డాయి.
అత్యవసర సమయంలో మాత్రమే ద్విచక్ర వాహనాలను మరియు కార్లకు అనుమతి కల్పించారు. కరోనా లాక్ డౌన్ నియమాలను ఉలంఘించిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులకు జరిమానాలు కూడా విధించారు. అనంతరం వాహన యజమానులను అరెస్టు చేశారు.
2020 మే మొదటి వారంలో లాక్డౌన్ సడలించబడింది. అనేక పరిమితులతో వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించబడింది. కానీ లాక్ డౌన్ ఇప్పటికీ తమిళనాడులో అమలులో ఉంది. లాక్ డౌన్ ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది. అక్కడి పోలీసులు ఇంకా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:మీకు తెలుసా.. ఈ కార్ ఒకే ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణిస్తుంది
తమిళనాడులో ప్రయాణించే వాహనాలపై మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 24 నుండి ఆగస్టు 11 వరకు 140 రోజుల్లో తీసుకున్న చర్యలపై సమాచారం ఇప్పుడు విడుదలైంది.
గత 140 రోజుల్లో మొత్తం 867,158 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఇది తమిళనాడులో నమోదైన కేసుల సంఖ్య మాత్రమే. నిబంధనను ఉల్లంఘించిన 9,57,743 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
MOST READ:వైకల్యాన్ని అధిగమించి స్కూటర్ తయారుచేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా ?
ఖైదీలను వ్యక్తిగత బెయిల్పై విడుదల చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి 6,77,629 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు పోలీసులు కరోనా లాక్ డౌన్ సమయంలో ఏకంగా రూ. 20.16 కోట్ల రూపాయల జరిమానాలు వసూలు చేశారు.
తమిళనాడులో అంతర్ జిల్లా ప్రయాణానికి చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇ-పాస్ విధానం అమలులో ఉన్నప్పటికీ ప్రజలు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు ప్రయాణించలేరు. ఈ-పాస్ విధానాన్ని రద్దు చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఈ-పాస్ విధానాన్ని రద్దు చేయలేదు.
MOST READ:మన దేశంలో అక్కడ డీజిల్ & పెట్రోల్ కూడా లిమిట్ గానే, ఎక్కడో తెలుసా
ఆగస్టు 1 నుంచి బస్సులను అనుమతిస్తామని ఇంతకు ముందు తమిళనాడు ప్రజలు ఆశించారు. అయితే బస్సులను అనుమతించలేదు. యథావిధిగా తమిళనాడులో బస్సులు ప్రారంభమవుతాయా లేదా అనేది ఇంకా తెలియలేదు.
గమనిక : ఇక్కడ ఫోటోలు కేవలం రెఫెరెన్స్ కోసం మాత్రమే