Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాక్డౌన్ లో ఇల్లుచేరుకోవడానికి 3 లక్షలు పైగా ఖర్చుపెట్టిన వ్యక్తి, ఎలా వెళ్ళాడో తెలుసా ?
భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనసేవలు నిలిపివేయబడ్డాయి. అన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేయడం జరిగింది. అంతే కాకుండా ఒక రాష్టంలోని వాహనాలను ఇతర రాష్ట్రాలలోకి రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాక్సీ, కారు, బస్సు, రైలు మరియు విమాన సర్వీసులన్నీ పూర్తిగా మూసివేయబడ్డాయి.
భారత్ మొత్తం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి వివిధ మార్గాలలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాలమంది ప్రజలు సుదూర ప్రాంతాలకు కూడా కాలినడకన చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంకా కొంతమంది సైకిల్స్ పైన కూడా తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.
ముంబయికి చెందిన ఒక వ్యక్తి 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని తన ఇంటికి చేరుకున్నాడు. ప్రయాణించేటప్పుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించబడటం గమనార్హం.
MOST READ:లాక్డౌన్ సమయంలో కొంపముంచిన పేస్ బుక్ పోస్ట్
ముంబై విమానాశ్రయంలో పనిచేస్తున్న ప్రేమ్ మూర్తి పాండేకు రవాణా సేవలు ఎలా పనిచేస్తాయో బాగా తెలుసు. ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ, అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ఎటువంటి పరిమితులు లేవని తనకి తెలుసు.
ఈ కారణంగానే ప్రేమ్ మూర్తి పాండే తన ఇంటికి చేరుకోవడానికి ఉల్లిపాయ వ్యాపారిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ విధానాన్ని అమలు చేయడానికి నాసిక్లోని పింపాల్గావ్లో మినీ ట్రక్కును ఉపయోగించుకోవడానికి నిర్ణయించకున్నాడు. ఈ విధంగా చేయాలనుకున్న తన ప్రయత్నం విజయవంతంగా ముగిసింది.
MOST READ:బిఎస్ 6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్యువి : ధర & ఇతర వివరాలు
ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తరువాత, పాండే తన ఇంటికి చేరుకోవడానికి రెండవ ప్రణాళికను రూపొందిచుకున్నాడు. ఈ ప్రాజెక్టులో భాగంగా పింపాల్గావ్ మార్కెట్ నుంచి రూ. 22.32 లక్షలకు 25.5 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఉల్లిపాయలు తీసుకెళ్లేందుకు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు.
పింపాల్గావ్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు పాండే ఒక ట్రక్కును తీసుకున్నాడు. దీనికి ట్రక్కు యజమానికి రూ. 77,500 చెల్లించారు. పాండే యొక్క ప్రణాళిక పూర్తి విజయవంతమైంది. మొత్తం ప్రయాణంలో వాటిని ఎక్కడా పోలీసుల దగ్గర ఆపబడలేదు.
MOST READ:ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతగా ఆకాశంలో హార్ట్ వేసిన పైలెట్
ఉల్లిపాయలను అమ్మేందుకు ఉత్తరప్రదేశ్లోని ముండేరా మార్కెట్కు వెళ్లినప్పుడు, ఇంత పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తరువాత, వారు కోట్వా ముబారక్ గ్రామంలోని ఉల్లిపాయలతో తమ ఇంటికి వెళ్ళారు. ఇంటికి చేరుకున్న తరువాత మొత్తం సమాచారం అందరికి తెలిసిపోయింది.