Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..
భారత నావికాదళంలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరనుంది. నరేంద్ర మోడీ భారత ప్రధానికి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దేశంలో త్రివిధ దళాలను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, భారత నావికా దళంలో కొత్తగా ఎంహెచ్ -60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి.

అమెరికాకి చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశం కోసం తయారు చేస్తున్న ఎంహెచ్ -60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్ మొట్టమొదటి ఫొటోలను విడుదల చేసింది. భారతదేశంలో నావీ డే సందర్భంగా లాక్హీడ్ మార్టిన్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ నుండి మొత్తం 24 హెలికాఫ్టర్లు భారత్కు చేరుకోనున్నాయి.

భారతీయ జలాల భద్రత మరియు నిఘాలో ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు ముఖ్యమైన పాత్రను పోషించనున్నాయి. ఈ హెలికాప్టర్లు నీటి లోపల మరియు వెలుపల ఉండే శత్రువులను గుర్తించేందుకు మరియు వారితో పోరాడేందుకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు, ఆయుధాలను కలిగి ఉంటుంది.

ఈ హెలికాప్టర్లో క్షిపణులు మరియు టార్పెడోలు అమర్చబడి ఉంటాయి. ఇవి నీటి ఉపరితలం పైన మరియు నీటి అడుగున ఉండే లక్ష్యాలను సైతం ఛేదించగలవు. ఇందులో హెల్ఫైర్ క్షిపణులు మరియు ఎంకే-54 టార్పెడోలు ఉంటాయి.

శత్రువుల జలాంతర్గాములు, ఓడలను నాశనం చేయగల శక్తిసామర్థ్యాలు వీటికి ఉంటాయి. అంతేకాకుండా, సముద్ర జలాల్లో రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి కూడా వీటిని రూపొందించబడ్డాయి. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన ఈ ఎంహెచ్-60 హెలికాఫ్టర్లు, ప్రస్తుతం భారత నావీ ఉపయోగిస్తున్న బ్రిటీషర్లు నిర్మించిన సీ కింగ్ హెలికాఫ్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.

ఈ హెలికాఫ్టర్లలో అధునాతన రాడార్ వ్యవస్థలు, మెషిన్ గన్లు, ఆధునిక రెస్క్యూ పరికరాలు మరియు సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి క్షిపణి లేదా శత్రువులు చేసే దాడిని ముందుగానే గుర్తించి సమాచారాన్ని అందిస్తాయి. ఇందులో అధునాతన సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఇది సముద్రం లోతులో దాగి ఉన్న జలాంతర్గాములను సైతం గుర్తించగలదు.

ఈ హెలికాప్టర్ గంటకు గరిష్టంగా 267 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇంధన ట్యాంక్ నిండినప్పుడు, ఈ హెలికాప్టర్ 10,659 కిలోల బరువుతో 834 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. చైనా, పాకిస్తాన్లతో సముద్ర సరిహద్దును పర్యవేక్షించడానికి ఈ హెలికాప్టర్లను మోహరించనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమైంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, అమెరికా నుండి భారతదేశానికి అపాచీ మరియు ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు సహా 3 బిలియన్ డాలర్ల ఆధునిక సైనిక పరికరాలు రానున్నాయి.