Just In
- 7 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 9 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 10 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
162 అడుగుల జీప్ ఎస్యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]
భారతదేశంలో గణపతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఆడంబరంగా జరుగుతాయి. మహారాష్ట్రలో ప్రతి ఏటా గొప్ప ఉత్సాహంతో మరియు ప్రదర్శనలతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. ఈ పది రోజుల్లో మహారాష్ట్ర వీధులు, ఇళ్లన్నీ గణేశుడి విగ్రహాలతో నిండి ఉంటాయి.
ఈ సారి కరోనా మహమ్మారి ఈ పండుగపై కూడా ప్రభావం చూపింది. అయినప్పటికీ ప్రజలు ఈ సమయంలో గణేశోత్సవాన్ని తమదైన రీతిలో జరుపుకుంటున్నారు.
ఇటీవల ఒక వీడియో ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతోంది. ఇందులో కార్ల సహాయంతో గణేశుడి విగ్రహాన్ని తయారుచేసే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రం పూణేలోని జీప్ ప్లాంట్లో ఉంది, ఇక్కడ 122 జీప్ కంపాస్ ఎస్యూవీలతో వినాయకుని చిత్రాన్ని తయారుచేశారు.
MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?
ప్లాంట్ యొక్క 29,970 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంలో నిర్మించిన ఈ విగ్రహాన్ని నిర్మించడానికి 122 జీప్ కంపాస్ ఎస్యూవీని ఉపయోగించారు. ఈ కార్లన్నింటినీ నడపడానికి 8 మంది ప్రొఫెషనల్ డ్రైవర్ల సహాయం తీసుకున్నారు.
విగ్రహాన్ని సిద్ధం చేయడానికి 50 గంటలకు పైగా సమయం పట్టింది. కార్ల నుండి తయారైన గణేశుడి విగ్రహం 162 అడుగుల ఎత్తు మరియు 185 అడుగుల వెడల్పుతో ఉంటుంది.
MOST READ:ఇది బుల్లెట్ బైక్ నుంచి తయారైన పాప్కార్న్ [వీడియో]
జీప్ కంపాస్ భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. పెట్రోల్ మోడల్లో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ బిఎస్ 6 ఇంజన్ ఉంది, ఇది 161 బిహెచ్పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
డీజిల్ మోడల్ 2.0-లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 170 బిహెచ్పి శక్తితో 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా హారియర్ మరియు ఎంజి హెక్టర్లలో కూడా ఇదే ఇంజిన్ ఉపయోగించబడింది. ఈ రెండూ జీప్ కంపాస్ యొక్క ప్రధాన ప్రత్యర్థి కార్లు.
MOST READ:కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?
కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా 2020 నవంబర్ నెలలో జీప్ కంపాస్ ఫేస్లిఫ్ట్ ప్రారంభించవచ్చు. జీప్ కార్ల కోసం భారతదేశం ఒక ప్రధాన తయారీ కేంద్రం. కంపెనీ యొక్క రంజన్గావ్ ప్లాంట్ నుంచి కార్లు విదేశాలకు ఎగుమతి అవుతాయి.