చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

భారతదేశంలో కార్ల దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. భారత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి ఈ కార్లు మరియు బైక్ ల దొంగతనాలు. ప్రతిరోజూ వందలాది వాహనాలు దొంగలించబడుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ దొంగతనాలను పూర్తిగా ఆపలేకపోతున్నారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

వాహనాలు దొంగతనం జరిగినప్పుడు కొన్ని మళ్ళీ పట్టుబడతాయి, అందులో చాలావరకు పట్టుబడవు. కానీ ఇటీవల కాలంలో లక్నో పోలీసులు ఏకంగా 11 కోట్ల విలువ కలిగిన కార్లను దొంగలించిన ముఠాను పట్టుకున్నారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

పోలీసులు ఈ దొంగల ముఠాను పట్టుకోగా ఇందులో 5 మంది ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ ఐదు మంది దొంగలించిన వాటిలో 50 కార్లు, మిగిలిన ఎస్‌యూవీలను జూన్ 21 న స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా దొంగలించిన మొత్తం వాహనాల సంఖ్య మొత్తం 112. ఇందులో 60 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

ఇప్పటివరకు దేశంలో ఇది అతిపెద్ద దొంగతనం ఇదే అని లక్నో పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల నివేదిక ప్రకారం ఈ ముఠా గతంలో దొంగిలించిన వాహనాలు మొట్ట 2 వేలకు పైగా ఉన్నాయి.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

దొంగలించిన వాహనాలు పట్టుబడకుండా ఉండటానికి వీరు కొన్ని ధ్వంసమైన వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను, ఇంజిన్ నంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించిన తరువాత, వారు దొంగిలించిన వాహనాలకు అమర్చడం జరుగుతుంది.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

సదాహరణగా రహదారి ప్రమాదాల్లో చిక్కుకుని దెబ్బతిన్న కార్లను కూడా ఈ ముఠా కొనుగోలు చేసి, ఈ వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలను అప్పుడు దొంగిలించబడిన వాహనాల వివరాలను భర్తీ చేయడానికి ఉపయోగించారు. అప్పుడు ఆ వాహనాలను ఇతరులకు విక్రయించేవారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

ఈ దొంగల ముఠా బిఎమ్‌డబ్ల్యూ సెడాన్ల వంటి అధిక-విలువైన లగ్జరీ కార్లను మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి అధిక-డిమాండ్ ఉన్న కార్లను లక్ష్యంగా చేసుకునేవారు. అంతే కాకుండా సాధారణ మాస్-సెగ్మెంట్ కార్లను కూడా దొంగలించేవారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

పోలీసులు దొంగలను గుర్తించి పట్టుకుని విచారించగా దొంగల ముఠాలో ఉన్న నిందితుల్లో ఒకరైన వినోద్ శర్మ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ కాగా, శ్వేతా గుప్తా మాజీ బ్యాంక్ క్లర్క్ అని గుర్తించారు. ఈ ముఠా సభ్యులు అప్పుడప్పుడు థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌ను సందర్శించేవారు. అంతే కాకుండా వీరు కింగ్‌పిన్ రిజ్వాన్ హోటళ్లలో ఉండేవారు. ఈ దొంగల ముఠాలోని వారు థాయ్‌లాండ్‌లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి అని కమీషనర్ నేలం నిలాబ్జా చౌదరి వెల్లడించారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

చాలా సందర్భాలలో దొంగలు వాహనాల భాగాలను తీసేసిన తరువాత విక్రయిస్తారు. అప్పుడు దొంగిలించబడిన వాహనాలను ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది. చాలా మంది దొంగ కార్లను నేపాల్ వంటి పొరుగు దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసిన తరువాత కూడా అమ్ముతారు.

11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

భారతదేశంలోని ఏ కారులోనైనా జీపీఎస్ ఆధారిత భద్రత అవసరం. ఇటీవల కాలంలో కోన్ని వాహనాలు అనేక భద్రతల లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ మరికొన్ని వాటికీ ఎటువంటి భద్రతా ఫీచర్స్ వుండవు. ఈ కారణంగా కార్లు ఎక్కువగా దొంగలించబడుతున్నాయి. కార్లలో జిపిఎస్ ఉన్నట్లయితే కారు ఎక్కడ ఉందొ అనే విషయం మనకు తెలియజేస్తుంది. అంతే కాకుండా యజమాని మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం ద్వారా కారును రిమోట్‌తో ఆపివేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

Article Published On: Friday, July 24, 2020, 18:29 [IST]
English summary
112 cars & SUVs worth Rs 11 crore recovered from MBA degree holder’s gang [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+