లగ్జరీ కార్లలో తిరుగుతూ 300 కోట్లను కొల్లగొట్టాడు!!
అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతూ, భారీ సంపద ఉన్నట్లు అందరినీ నమ్మించి దాదాపు 300 కోట్ల రుపాయలు కొల్లగొట్టాడు, చివరికి పోలీసులకు ఇలా చిక్కాడు....
కొన్ని కోట్ల విలువ చేసే కార్లను కలిగి ఉన్నాడు, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఎమ్బిఎ చదివిన హర్షవర్ధన్ రెడ్డి కొంత మంది వ్యక్తులకు ఏక మొత్తంలో రూ. 300 కోట్ల రుపాయల వరకు టోకరా వేశాడు. మొత్తానికి ఢిల్లీ పోలీసులకు చిక్కాడు.

హర్షవర్దన్ రెడ్డి చెన్నై, ముంబాయ్ మరియు ఢిల్లీ నగరాలలో మోసాలకు పాల్పడుతూ, పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరిగాడు. అయితే మార్చి 22, 2017 న హర్షవర్దన్ను పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసారు.

దక్షిణ మండలి డిసిపి ఈశ్వర్ మాట్లాడుతూ, "వివిధ నగరాలలోని అత్యంత విలువైన ప్రదేశాల్లో ఉన్న విలువైన ప్రాపర్టీగల వ్యక్తులను కలిసే వాడు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విలువ కంటే ఎక్కువ అద్దె ఇవ్వజూపేవాడు."

ఒక్కసారి వారు అంగీకరించిన తరువాత తన పేరు మీదకు లీజుకు తీసుకున్నట్లు దస్తావేజులు రాయించుకునేవాడు. అద్దె విషయానికి వస్తే, కాలం చెల్లిన చెక్కుల్లో అద్దెన్ అడ్వాన్స్గా చెల్లించే వాడు.

లీజుకు తీసుకున్నట్లు దస్తావలేజులు పొందిన తరువాత, వాటిని తన పేరు మీద ఉన్నట్లుగా సృష్టించి పలు బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లను తీసుకునే ఆ తరువాత ఎవరికీ దొరక్కుండా అందకారంలోకి వెళ్లిపోయేవాడు.

అంతే కాకుండా హర్షవర్ధన్ రెడ్డి విభిన్న పుట్టిన రోజు తారీఖులతో చట్టవిరుద్దంగా మూడు పాన్ కార్డులను మరియు రెండు పాస్పోర్ట్లను పొందాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన నివాసాలను మారుస్తూ అనేక అసాంఘిక కార్యకలాపాలు సాగించినట్లు జిసిపి వెల్లడించాడు.


Click it and Unblock the Notifications








