Just In
- 6 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 9 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 12 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 15 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేడ్ ఇన్ ఇండియా యుద్ధనౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్' (IAC-1) ప్రారంభం.. పాత విక్రాంత్కు ఇది నివాళి!
భారత సైన్యం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) సెప్టెంబరు 02, 2022వ తేదీన భారత నావికాదళంచే ప్రారంభించబడింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు నిర్మించిన విమాన వాహక నౌక. భారత సైన్యంలో 1961 మరియు 1997 మధ్యకాలంలో భారత నౌకాదళానికి సేవలందించిన పాత ఐఎన్ఎస్ విక్రాంత్కు నివాళిగా IAC-1 (ఇండీజెనస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్-1) కి ఐఎన్ఎస్ విక్రాంత్ అని పేరు పెట్టారు.
Recommended Video
పాత నౌకతో పోలిస్తే, ఈ 2022 మోడల్ నౌక అనేక అధునాతన ఆయుధాలను మరియు టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఇండియన్ నేవీ జనవరి 26, 1950న స్థాపించబడింది మరియు ప్రస్తుతం మన నావికా దళం ప్రపంచంలోనే ఏడవ అతిపెద్దది. భారత నావికా దళం 67,000 మంది క్రియాశీల సిబ్బంది మరియు 75,000 మంది రిజర్వ్ సిబ్బందిని కలిగి ఉంది. అలాగే, 150కి పైగా నౌకలు మరియు 300 యుద్ధ విమానాలతో భారత నావికాదళం శత్రు దేశాలతో పోరాడే బలమైన శక్తిని కలిగి ఉంది.
భారతదేశపు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మరియు ది లెజెండరీ ఐఎన్ఎస్ విక్రాంత్
ఏ దేశ భద్రతకైనా నౌకాదళం చాలా ముఖ్యమైనది. ఇది జల మరియు వాయు మార్గాలకు సంబంధించిన వారధిలా పనిచేస్తుంది. శత్రు దేశాల ఎత్తుగడలను ఛేధించడంలో నౌకాదళంలో విమాన వాహక నౌకలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం నుండి నేర్చుకున్న పాఠాల ద్వారా విమాన వాహక నౌకల ప్రాముఖ్యత పట్ల భారతదేశం ప్రత్యేక శ్రద్ధ వహించడం ప్రారంభించింది. ఆ వెంటనే, నావికాదళంలోని ఉన్నతాధికారులు విమాన వాహక నౌక కోసం తమ అన్వేషణను ప్రారంభించారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, రాయల్ నేవీ హెచ్ఎమ్ఎస్ హెర్క్యులస్ అనే విమాన వాహక నౌకను నిర్మించడం ప్రారంభించింది. ఇది 1943లో ప్రారంభించబడింది మరియు యుద్ధ ప్రయత్నాలలో సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. అయితే, యుద్ధం 1945లో ముగిసిపోవడంతో, హెచ్ఎమ్ఎస్ హెర్క్యులస్ నిర్మాణం 1946లో నిలిపివేయబడింది. ఆ తర్వాత 1947లో, ఓడ గరే లోచ్కు తరలించబడింది మరియు అక్కడే స్టోరేజ్ లో ఉంచబడింది.
అదే సంవత్సరంలో భారతదేశం బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది మరియు మూడు సంవత్సరాల తరువాత, భారత నౌకాదళం ఏర్పడింది. చివరగా, 1957లో, భారత నావికాదళం ఈ ఓడను కొనుగోలు చేసింది మరియు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దానిని బెల్ఫాస్ట్ కు తీసుకెళ్లింది. ఈ ఓడలో కొన్ని మార్పులు చేయబడ్డాయి మరియు చివరకు, ఈ నౌకను 1961లో భారత నౌకాదళం ప్రారంభించింది.
ఈ ఓడకే ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరును పెట్టడం కూడా జరిగింది. ఇలా ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఈ పేరులో విక్రాంత్ అనే పదం విక్రంత అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం ధైర్యం అని. ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఓడ మరియు ఇది 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో చాలా కీలకంగా వ్యవహరించింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ (R11) పాకిస్తాన్ నౌకాదళం యొక్క నావికా దిగ్బంధనానికి మరియు ఎన్ఎస్ విక్రాంత్ నుండి వచ్చిన విమానాలు పూర్వపు తూర్పు పాకిస్తాన్లోని ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై బాంబు దాడికి బాధ్యత వహించాయి. యుద్ధం సమయంలో మరియు ఆ తర్వాత సంవత్సరాలలో దాని చర్యలు R11ని ప్రపంచంలోని వివిధ నావికా వర్గాలలో ఒక లెజెండ్గా మారేలా చేశాయి. కాగా, ఇప్పుడు కొత్తగా రూపొందించిన విమాన నౌకకు కూడా పాత ఐఎన్ఎస్ విక్రాంత్ గౌరవార్థం ఐఎన్ఎస్ విక్రాంత్ అనే పేరునే పెట్టారు.
2022 ఐఎన్ఎస్ విక్రాంత్ (IAC-1)
భారత సైన్యం పూర్తిగా స్వదేశీ వనరులతో రూపొందించిన ఈ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (IAC-1)ను ఇండియన్ నేవీ 2004లో కోసం ఆర్డర్ చేసింది మరియు కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ని దాని బిల్డర్గా ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి18, 2009న ప్రతిపాదించబడింది మరియు ఆగస్టు 12, 2013వ తేదీన ప్రారంభించబడింది. కాగా, ఎట్టకేలకు ఇది సెప్టెంబర్ 2, 2022వ తేదీన అధికారికంగా సైన్యంలో చేరింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమాన వాహక నౌకను ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ ఓడ మొత్తం పొడవు 262 మీటర్లు మరియు వెడల్పు 62 మీటర్లు. చూడటానికి 18 అంతస్థుల భవనం మాదిరిగా ఉండే ఐఎన్ఎస్ విక్రాంత్లో 1,600 మంది సిబ్బంది మరియు 30 యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రారంభంలో, ఐఎన్ఎస్ విక్రాంత్ MiG-29K యుద్ధ విమానాలను మరియు AEW&C మరియు ASW హోదాలో ఉండే అధికారుల కోసం Kamov Ka-31 మరియు Sikorsky MH-60R హెలికాప్టర్లను కూడా కలిగి ఉంటుంది.
ఇందులోని రెండు ఎయిర్క్రాఫ్ట్ లిఫ్ట్లు విమానాన్ని హ్యాంగర్ నుండి ఫ్లైట్ డెక్కు మరియు వెనుకకు రవాణా చేయడంలో సహాయపడతాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు రాబోయే ఐఎన్ఎస్ విశాల్లలో మరిన్ని విమానాలను చేర్చాలని సైన్యం పరిగణిస్తున్నట్లు సమాచారం. కమోడోర్ విద్యాధర్ హర్కే ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క మొదటి కమాండింగ్ ఆఫీసర్.
ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించిన సందర్భంగా, భారత నౌకాదళానికి చెందిన కొత్త ఎన్సైన్ను కూడా ఆవిష్కరించారు. కొత్త నౌకాదళ ఎన్సైన్ జాతీయ జెండా మరియు యాంకర్ పైన జాతీయ చిహ్నంతో అస్పష్టమైన అష్టభుజిని కలిగి ఉంటుంది మరియు ఇది సముద్రాల దేవుడిని పిలిచే వేద మంత్రం అయిన నేవీ యొక్క నినాదం 'సమ నో వరుణ'ను కూడా కలిగి ఉంటుంది.