హీరో విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్; లక్ష జరిమానా
ఇళయదళపతి విజయ్ గురించి దాదాపు తెలియని వారు ఉండరు. ఇతడు తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు విజయ్ కి దాదాపు 1 లక్ష వరకు జరిమానా విధించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఇంగ్లాండ్ నుంచి విజయ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. అత్యంత ఖరీదైన రోల్స్ రాయ్ కారుని ఆయన దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన ట్యాక్స్ ని ఆయన చెల్లించలేదు. పైగా తనకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు.

విజయ్ పిటీషన్ని మంగళవారం మద్రాస్ హైకోర్ట్ కొట్టేసింది. ట్యాక్స్ చెల్లించనందుకు ఆయనకు రూ. 1 లక్ష జరిమానా విధించింది. అందేకాదు హీరోలు ట్యాక్స్ కట్టేందుకు నిరాకరిస్తున్నారని కూడా కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. ఇక విజయ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు సుమారు రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.

దీనితో పాటు తమిళ నటుడు పన్ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఉత్తర్వు కాపీని అందుకున్న రెండు వారాల్లోపు తమిళనాడు కరోనా రిలీఫ్ ఫండ్లో లక్ష రూపాయల వరకు జరిమానాను జమ చేయాలని విజయ్ను ఆదేశించింది.

సౌత్ సినిమా స్టార్ విజయ్ అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇందులో అతని వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ విషయానికి వస్తే, ఇది సూపర్ లగ్జరీ సెడాన్. ఈ కారు కంపెనీ యొక్క అల్యూమినియం స్పేస్ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ నుండి తయారు చేయబడింది.

ఈ కారు బరువు 2,500 కేజీల వరకు ఉంటుంది. ఇది కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, రోల్స్ రాయిస్ ఘోస్ట్ విజన్ అసిస్ట్, డే-నైట్ వార్నింగ్, నాలుగు కెమెరాలు, వై-ఫై హాట్స్పాట్, సెల్ఫ్ పార్క్ మొదలైన అనేక ఫీచర్స్ ఉన్నాయి.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ లోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 570 బిహెచ్పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4-వీల్ డ్రైవ్ ఆధారంగా రూపొందించబడింది.

ఈ కారును ఇంగ్లాండ్ నుండి 2012 లో దిగుమతి చేసుకున్నారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాహనాలు భారతదేశంలో గరిష్ట పన్నుకు లోబడి ఉంటాయి. ఈ పన్నులు 15% నుండి 125% వరకు ఉంటాయి. సికెడి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలకు 25%, ప్యాసింజర్ వాహనాలకు 30%, ట్రక్కు, బస్సులకు 30% టాక్స్ విధించారు.

సిబియు ద్వారా దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాలకు 50%, $ 40,000 కంటే తక్కువ విలువైన కార్లకు 60% మరియు $ 40,000 కంటే ఎక్కువ విలువైన కార్లకు 100% పన్ను విధించబడుతుంది. ఈ నిబంధనలకు లోబడి టాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ కారణంగానే విజయ్ కూడా లక్ష జరిమానా విధించారు.


Click it and Unblock the Notifications








