Just In
- 50 min ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 1 hr ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 3 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 3 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
Don't Miss
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
సోలార్తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్, తయారుచేసింది ఓ స్టూడెంట్
భారతదేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చాలా మంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా కొంతమంది తమ ఆలోచనలతో కొత్త కొత్త వాహనాలను తయారుచేస్తున్నారు.
ఇటీవల కాలంలో కెఎల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బృందం వైర్లెస్ ఛార్జింగ్ తో పనిచేసే ఒక ఎలక్ట్రిక్ బైక్ తయారుచేశారు. ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, తమిళనాడులోని మదురై నుండి కాలేజీకి చెందిన ఒక స్టూడెంట్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారుచేశారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సోలార్ పవర్ తో నడుస్తుంది. ఈ విద్యార్థి ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి సంబంధించిన ఫోటోలు కూడా విడుదలయ్యాయి.
మదురైలోని కాలేజీలో చదువుతున్న ఈ స్టూడెంట్ పేరు 'ధనుష్ కుమార్'. వార్తా సంస్థ ANI యొక్క నివేదిక ప్రకారం, మదురై కళాశాల విద్యార్థి ధనుష్ కుమార్ సోలార్ పవర్ తో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్ను రూపొందించారు. సోలార్ ప్లేట్స్ సహాయంతో ఈ సైకిల్ 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ఇందులో ఛార్జ్ తగ్గిన తర్వాత కూడా దాదాపు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించగలదు, అని నివేదికలో పేర్కొంది. వార్తా సంస్థ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క పరిధితో పాటు కిలోమీటరుకు దాని ధర మరియు ఛార్జీల గురించి కూడా సమాచారం అందించింది.
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బ్యాటరీ కోసం ఉపయోగించే విద్యుత్ ఖర్చు పెట్రోల్ ధర కంటే చాలా తక్కువ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 50 కిలోమీటర్ల ప్రయాణించడానికి కేవలం రూ. 1.50 ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ ఈ-సైకిల్ 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
మదురై వంటి నగరం లోపల ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సరిపోతుందని, స్టూడెంట్ ధనుష్ కుమార్ వ్యక్తం చేశారు. ధనుష్ కుమార్ యొక్క ఈ-సైకిల్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్లో చాలా రెస్పాండ్స్ వస్తున్నాయి. చాలామందికి ఈ సోలార్ ప్లేట్స్ తో పనిచేసే ఈ సైకిల్ చాలా బాగా నచ్చింది.