మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంధన ధరలు దాదాపు 100 రూపాయలు దాటేసింది. భారీగా పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపింది. రోజువారీ ప్రయాణం కోసం వాహనాలపై ఆధారపడే వాహనదారులు వాహనాలను ఉపయోగించడానికి కూడా సంకోచిస్తున్నారు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

భారీగా పెరిగిన ఇంధన ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా భారతదేశంలో చాలా మంది దుకాణాదారులు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే మొన్న ఒక కేజీ కేక్ కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఉంచితంగా ఇచ్చారు. నిన్న ఒక కేజీ మాంసం కొంటె ఒక లీటర్ పెట్రోల్ అందించారు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

అయితే ఇప్పుడు మదురైలోని బిపి చెరువు ప్రాంతంలో ఉన్న ఒక చేపల దుకాణం తన కస్టమర్లకు ఒక కొత్త ఆఫర్ అందించారు. ఈ చేపల దుకాణాదారులు విడుదల చేసిన ఆఫర్ ప్రకారం 500 రూపాయలకంటే ఎక్కువ విలువైన చేపలు కొనుగోలు చేస్తే, వారికి ఒక లీటర్ ఉచితంగా అందించబడుతుంది.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

ఈ ఆఫర్ ప్రకటించిన తరువాత, చాలామంది కస్టమర్లు చేపలు కొనడానికి చేపల దుకాణానికి ఎగబడుతున్నారు. ఈ చేపల దుకాణం ముందు ఈ ఆఫర్ గురించి నోటీసు బోర్డు కూడా పెట్టబడింది. ఈ ఇన్‌స్ట్రక్షనల్ ప్యానెల్‌లో స్టోర్‌కు వచ్చిన కస్టమర్‌లు ఫేస్ మాస్క్ ధరించాలి మరియు సామాజిక అంతరాలను పాటించాలి అని రాయబడి ఉంది.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

ప్రస్తుతం 500 రూపాయలకంటే ఎక్కువ చేపలు కొనుగోలు చేసే వినియోగదారులకు ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తామని నోటీసు బోర్డులో ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 1 వ తేదీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ దుకాణం ముందు గుమికూడారు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

అక్కడికి వచ్చిన చాలామంది కస్టమర్లు ఈ విషయాన్ని తన స్నేహితులు మరియు పరిచయస్తులకు కూడా తెలియజేశాడు. చేపల కొనుగోలుదారులు ఉచితంగా పెట్రోల్ పొందుతున్నారనే సమాచారంతో ప్రజలు దుకాణం చేరుకున్నారు. అంచనాలను మించి ప్రజలు అక్కడికి రావడంతో స్టోర్ సిబ్బంది కస్టమర్లను కంట్రోల్ చేయడానికి తగిన మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

దుకాణాదారుడు 500 రూపాయల కంటే ఎక్కువ విలువైన చేపలను కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 లీటర్ పెట్రోల్ అందించడానికి టోకెన్ ఇవ్వబడింది. ఈ టోకెన్ తీసుకున్న వినియోగదారులు పెట్రోల్ బంక్‌లో ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా పొందవచ్చు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

చేపల దుకాణం ప్రకటించిన ఈ ప్రకటనకు మంచి ఆదరణ లభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మలైమలార్ వార్తాపత్రిక నివేదించింది. ఇండియా ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి చాలా ఆఫర్లు వచ్చాయి.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

ఈ విధమైన ఆఫర్స్ సంబంధిత దుకాణాల వస్తువులను పెంచడానికి దారితీసింది. ఈ ఆఫర్ల ద్వారా పెట్రోల్ ఉచితంగా పొందిన వాహనదారులు పెట్రోల్ ధర తగ్గించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. కానీ భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు.

మీకు తెలుసా.. అక్కడ చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ

పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా చాలామంది, వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్‌ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు, కావున రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

Source: Maalaimalar

More from DriveSpark

Article Published On: Tuesday, August 3, 2021, 19:32 [IST]
English summary
Madurai fish stall offers one liter free petrol for its customers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+