స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

భారతదేశం అభివృద్ధి చెందుతున్న క్రమంలో వాహనాలను ఉపయోగించకుండా ఒకే చోట ఉంచడం సాధ్యమయ్యే పని కాదు. ఆఫీసులకు వెళ్లాలన్నా, మార్కెట్లకు వెళ్లాలన్నా వాహనాలను ఉపయోగించుకుండా ఉండలేము. కానీ కరోనా వైరస్ ప్రజల జీవితాలను ఎక్కువ ప్రభావితం చేసింది.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి 2020 మార్చి 24 నుండి భారతదేశంలో లాక్ డౌన్ అమలు చేయబడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా, మార్చి చివరి నుండి ట్రాఫిక్ పరిమితం చేయబడింది. లాక్ డౌన్ మే ప్రారంభం వరకు అమలులో ఉంది. లాక్ డౌన్ లో బయట తిరిగే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

మే మొదటి వారం నుండి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కి కొన్ని మినహాయింపులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వాహనాల రద్దీ తిరిగి ప్రారంభమైంది. లాక్ డౌన్ కి కొన్ని మినహాయింపులు కల్పించడం వల్ల పరిస్థితి మునుపటిలాగా మారింది.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

మదురైకి చెందిన ఒక న్యాయవాది గత మూడు నెలలుగా తన ద్విచక్ర వాహనం ఉపయోగించడం లేదు. ఇది కరోనా వైరస్ మరియు లాక్ డౌన్ కారణం వల్ల మాత్రం కాదు. ఎందుకంటే తన స్కూటర్‌లో పిచ్చుక గూడు కట్టింది.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

అరుణ్ స్వామినాథన్ మదురైలోని ఉలగానేరి ప్రాంతానికి చెందినవాడు. మద్రాస్ హైకోర్టులోని న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయనకు టీవీఎస్ స్కూటర్ ఉంది. పిచ్చుక మూడు నెలల క్రితం ఆ స్కూటర్‌లో ఒక గూడు నిర్మించింది. అరుణ్ స్వామినాథన్ కి గూడును తొలగించడానికి మనసు ఒప్పలేదు.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

ఈ కారణంగా అతని స్కూటర్ గత మూడు నెలలుగా ఒకే ప్రదేశంలో నిలిపివేశాడు. ఆ స్కూటర్ ని అతడు పక్కకు కూడా కదిలించలేదు. ఇప్పుడు పిచ్చుక ఈ గూడులో గుడ్లు కూడా పెడుతుంది. పిచ్చుక గూడు కట్టుకోవడం వల్ల ఆ స్కూటర్‌ను తొలగించబోనని అరుణ్ స్వామినాథన్ స్పష్టంగా తెలిపాడు.

ఫేస్‌బుక్‌తో సహా పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అరుణ్ స్వామినాథన్ మానవత్వానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పిచ్చుక గూటికి హాని కలిగించడానికి స్కూటర్ ఉపయోగించని ఈ లాయర్ గురించి టెలిగ్రాఫ్ టీవీ నివేదించింది.

స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

ఇటీవల కాలంలో మొబైల్ టవర్ల వల్ల కలిగే రేడియేషన్ మరియు ఇతర కారణాల వల్ల పిచ్చుకలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో, పిచ్చుకలను రక్షించడానికి 3 నెలలకు పైగా స్కూటర్ ఉపయోగించని న్యాయవాది అరుణ్ స్వామినాథన్ నిజంగా ప్రశంసనీయం.

Source: Thanthi TV/YouTube

More from DriveSpark

Article Published On: Friday, July 17, 2020, 13:02 [IST]
English summary
Madurai lawyer not using his scooty from three months due to sparrow nest. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+