Just In
- 2 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 4 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 8 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 10 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు
భారతదేశంలో ఇటీవలి దొగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాలను నివారించడానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఇటీవల పోలీసులు ఇద్దరు దొంగలను నాలుగు గంటలు వెంబడించి అరెస్టు చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
ఆటో హిందుస్తాన్ టైమ్స్ యొక్క నివేదికల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా పోలీసులు తనిఖీ కోసం చెక్పోస్టులను నిర్మించారు.
పోలీసులు పెట్రోలింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించారు. వెంటనే పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయడానికి బయలుదేరారు. పట్టుబడతారనే భయంతో ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు కూడా వారు తప్పించుకోకూడదని వెంబడించారు.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి
పోలీసులు సుమారు నాలుగు గంటలు వెంబడించిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరినీ విచారించినప్పుడు అసలైన నిజాలు బయటపడ్డాయి. ఈ విచారణలో ఆ ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన కార్ల నుండి డీజిల్ దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు.
వారు పట్టుబడిన ఆ ఒక్కరోజు మాత్రమే దాదాపు 140 లీటర్ల డీజిల్ను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును తీవ్రతరం చేయడంతో పాటు, వాహనాలనుంచి డీజిల్ దొంగిలించడానికి వీలుగా ఉపయోగపడుతున్న రెండు కీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల నుండి చాలా రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ దొంగలిస్తున్నారు. చివరకు పోలీసుల అనుమానం నిజమైంది. ఈ అనుమానంతోనే ఈ ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు డీజిల్ మరియు పెట్రోల్ కొనడానికి ఇబ్బదులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల సాధారణ స్థితికి రావడానికి ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి
ఈ సమయంలోనే డీజిల్ దొంగలిస్తున్న ఈ దొంగలను అరెస్ట్ చేయడం వల్ల కొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో కూడా వీరు ఎక్కువగా పెట్రోల్ మరియు డీజిల్ దొంగలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి దొంగతనాలను వీలైనంత వరకు పూర్తిగా రూపుమాపాలి.
ఇలాంటి దొంగతనాలను నుంచి విముక్తి పొందటానికి వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాలలో లేదా సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట పార్క్ చేసి ఉంచడం చాలా మంచిది. ఇలాంటి దొంగతనాలు పూర్తిగా రోపుమాపాలంటే, పోలీసులకు వాహనదారుల సహకారం ఎంతైనా అవసరం.
MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?
NOTE:ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే