Just In
- 2 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 2 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 3 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Movies Vasanthi Krishnan: భర్తతో హనీమూన్ కంటే అతడితో రొమాన్సే ముఖ్యం.. అందుకే ఇక్కడే ఉండిపోయా!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు
భారతదేశంలో ఇటీవలి దొగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాలను నివారించడానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఇటీవల పోలీసులు ఇద్దరు దొంగలను నాలుగు గంటలు వెంబడించి అరెస్టు చేశారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
ఆటో హిందుస్తాన్ టైమ్స్ యొక్క నివేదికల ప్రకారం, ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో కూడా ఇటీవల కాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా పోలీసులు తనిఖీ కోసం చెక్పోస్టులను నిర్మించారు.
పోలీసులు పెట్రోలింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించారు. వెంటనే పోలీసులు ఇద్దరిని తనిఖీ చేయడానికి బయలుదేరారు. పట్టుబడతారనే భయంతో ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు కూడా వారు తప్పించుకోకూడదని వెంబడించారు.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి
పోలీసులు సుమారు నాలుగు గంటలు వెంబడించిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరినీ విచారించినప్పుడు అసలైన నిజాలు బయటపడ్డాయి. ఈ విచారణలో ఆ ఇద్దరు వ్యక్తులు పార్క్ చేసిన కార్ల నుండి డీజిల్ దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు.
వారు పట్టుబడిన ఆ ఒక్కరోజు మాత్రమే దాదాపు 140 లీటర్ల డీజిల్ను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును తీవ్రతరం చేయడంతో పాటు, వాహనాలనుంచి డీజిల్ దొంగిలించడానికి వీలుగా ఉపయోగపడుతున్న రెండు కీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల నుండి చాలా రోజుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ దొంగలిస్తున్నారు. చివరకు పోలీసుల అనుమానం నిజమైంది. ఈ అనుమానంతోనే ఈ ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు డీజిల్ మరియు పెట్రోల్ కొనడానికి ఇబ్బదులు పడుతున్నారు. ఈ ధరల పెరుగుదల సాధారణ స్థితికి రావడానికి ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి
ఈ సమయంలోనే డీజిల్ దొంగలిస్తున్న ఈ దొంగలను అరెస్ట్ చేయడం వల్ల కొంతమంది ఊపిరి పీల్చుకుంటున్నారు. గతంలో కూడా వీరు ఎక్కువగా పెట్రోల్ మరియు డీజిల్ దొంగలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి దొంగతనాలను వీలైనంత వరకు పూర్తిగా రూపుమాపాలి.
ఇలాంటి దొంగతనాలను నుంచి విముక్తి పొందటానికి వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాలలో లేదా సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట పార్క్ చేసి ఉంచడం చాలా మంచిది. ఇలాంటి దొంగతనాలు పూర్తిగా రోపుమాపాలంటే, పోలీసులకు వాహనదారుల సహకారం ఎంతైనా అవసరం.
MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?
NOTE:ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే