Just In
- 1 hr ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 4 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 6 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 10 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా ఎఫెక్ట్ : కొత్త కారు కొనుగోలును నిలిపివేసిన గవర్నర్, ఎవరో తెలుసా ?
కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. భారతదేశం దీనికి మినహాయింపు కాదు. భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించడం ప్రారంభించాయి. ఇది ఇలా వుండగా ప్యాలెస్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారీ కొత్త కారు కొనుగోలును కూడా రద్దు చేశారు.
అదనంగా ప్యాలెస్లో నిర్మాణ, మరమ్మత్తు పనులను వంటి వాటిని కూడా గవర్నర్ నిలిపివేశారు. రాజభవనంలో కొత్త నియామకాలు చేయవద్దని, వివిఐపిలకు బహుమతి సంప్రదాయాన్ని ఇప్పుడు నిలిపివేయాలని గవర్నర్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఇ 350 సిడిఐని అధికారిక కారును ఉపయోగిస్తున్నారు.
ఈ కారు 2014 లో బుక్ చేయబడింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉపయోగించే వాహనాలు చాలా భద్రత చర్యలను కలిగి ఉంటాయి. ప్యాలెస్లో చేరిన తర్వాత ఈ కారు మరింత కట్టుదిట్టమైన భద్రతలను కల్పించారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్యూవీ లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా !
ఈ కారును భగత్ సింగ్ కోష్యారి కంటే ముందు వున్న గవర్నర్ కూడా ఉపయోగించారు. 2019 సెప్టెంబర్లో మహారాష్ట్ర గవర్నర్గా నియమించబడిన భగత్ సింగ్ కోషార్ తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ కారును ఉపయోగించుకుంటారు.
గవర్నర్ తదుపరి కారు ఏది కొంటారో తెలియదు. నిబంధనల ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి మరియు లోకాయుక్త తమకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వారు కొనే కార్లకు ఆర్థిక పరిమితి వంటి వుండవు.
MOST READ:ఇండియాలో రాపిడ్ ఆటోమేటిక్ ఎడిషన్ లాంచ్ చేసిన స్కోడా
ఇప్పటికే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కొత్త అధికారిక వాహనాలను కొనుగోలు చేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి ప్రయాణ ఖర్చులను తగ్గించాలని మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని మంత్రికి సూచించబడింది.
విమాన ప్రయాణం అవసరమైనప్పుడు బిజినెస్ క్లాస్కు బదులుగా ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించాలని అధికారులకు సూచించారు. సమావేశాలు, సెమినార్లు, సమావేశాలకు లగ్జరీ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని అధికారులకు సూచించబడింది. కరోనా వైరస్ ప్రాభవం వల్ల ఆర్థిక వ్యవస్థను కొంతవరకు కాపాడుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతోంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : గ్రామస్థులు బహిష్కరించడంతో కారులోనే ఉండిపోయిన యువకుడు