Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా ఎఫెక్ట్ : కొత్త కారు కొనుగోలును నిలిపివేసిన గవర్నర్, ఎవరో తెలుసా ?
కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. భారతదేశం దీనికి మినహాయింపు కాదు. భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించడం ప్రారంభించాయి. ఇది ఇలా వుండగా ప్యాలెస్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారీ కొత్త కారు కొనుగోలును కూడా రద్దు చేశారు.
అదనంగా ప్యాలెస్లో నిర్మాణ, మరమ్మత్తు పనులను వంటి వాటిని కూడా గవర్నర్ నిలిపివేశారు. రాజభవనంలో కొత్త నియామకాలు చేయవద్దని, వివిఐపిలకు బహుమతి సంప్రదాయాన్ని ఇప్పుడు నిలిపివేయాలని గవర్నర్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఇ 350 సిడిఐని అధికారిక కారును ఉపయోగిస్తున్నారు.
ఈ కారు 2014 లో బుక్ చేయబడింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉపయోగించే వాహనాలు చాలా భద్రత చర్యలను కలిగి ఉంటాయి. ప్యాలెస్లో చేరిన తర్వాత ఈ కారు మరింత కట్టుదిట్టమైన భద్రతలను కల్పించారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్యూవీ లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా !
ఈ కారును భగత్ సింగ్ కోష్యారి కంటే ముందు వున్న గవర్నర్ కూడా ఉపయోగించారు. 2019 సెప్టెంబర్లో మహారాష్ట్ర గవర్నర్గా నియమించబడిన భగత్ సింగ్ కోషార్ తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ కారును ఉపయోగించుకుంటారు.
గవర్నర్ తదుపరి కారు ఏది కొంటారో తెలియదు. నిబంధనల ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి మరియు లోకాయుక్త తమకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వారు కొనే కార్లకు ఆర్థిక పరిమితి వంటి వుండవు.
MOST READ:ఇండియాలో రాపిడ్ ఆటోమేటిక్ ఎడిషన్ లాంచ్ చేసిన స్కోడా
ఇప్పటికే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కొత్త అధికారిక వాహనాలను కొనుగోలు చేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి ప్రయాణ ఖర్చులను తగ్గించాలని మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని మంత్రికి సూచించబడింది.
విమాన ప్రయాణం అవసరమైనప్పుడు బిజినెస్ క్లాస్కు బదులుగా ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించాలని అధికారులకు సూచించారు. సమావేశాలు, సెమినార్లు, సమావేశాలకు లగ్జరీ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని అధికారులకు సూచించబడింది. కరోనా వైరస్ ప్రాభవం వల్ల ఆర్థిక వ్యవస్థను కొంతవరకు కాపాడుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతోంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : గ్రామస్థులు బహిష్కరించడంతో కారులోనే ఉండిపోయిన యువకుడు