Just In
- just now ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కరోనా ఎఫెక్ట్ : కొత్త కారు కొనుగోలును నిలిపివేసిన గవర్నర్, ఎవరో తెలుసా ?
కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి. భారతదేశం దీనికి మినహాయింపు కాదు. భారతదేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించడం ప్రారంభించాయి. ఇది ఇలా వుండగా ప్యాలెస్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారీ కొత్త కారు కొనుగోలును కూడా రద్దు చేశారు.
అదనంగా ప్యాలెస్లో నిర్మాణ, మరమ్మత్తు పనులను వంటి వాటిని కూడా గవర్నర్ నిలిపివేశారు. రాజభవనంలో కొత్త నియామకాలు చేయవద్దని, వివిఐపిలకు బహుమతి సంప్రదాయాన్ని ఇప్పుడు నిలిపివేయాలని గవర్నర్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ఇ 350 సిడిఐని అధికారిక కారును ఉపయోగిస్తున్నారు.
ఈ కారు 2014 లో బుక్ చేయబడింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉపయోగించే వాహనాలు చాలా భద్రత చర్యలను కలిగి ఉంటాయి. ప్యాలెస్లో చేరిన తర్వాత ఈ కారు మరింత కట్టుదిట్టమైన భద్రతలను కల్పించారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్యూవీ లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా !
ఈ కారును భగత్ సింగ్ కోష్యారి కంటే ముందు వున్న గవర్నర్ కూడా ఉపయోగించారు. 2019 సెప్టెంబర్లో మహారాష్ట్ర గవర్నర్గా నియమించబడిన భగత్ సింగ్ కోషార్ తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ కారును ఉపయోగించుకుంటారు.
గవర్నర్ తదుపరి కారు ఏది కొంటారో తెలియదు. నిబంధనల ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి మరియు లోకాయుక్త తమకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వారు కొనే కార్లకు ఆర్థిక పరిమితి వంటి వుండవు.
MOST READ:ఇండియాలో రాపిడ్ ఆటోమేటిక్ ఎడిషన్ లాంచ్ చేసిన స్కోడా
ఇప్పటికే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి కొత్త అధికారిక వాహనాలను కొనుగోలు చేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడానికి ప్రయాణ ఖర్చులను తగ్గించాలని మరియు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని మంత్రికి సూచించబడింది.
విమాన ప్రయాణం అవసరమైనప్పుడు బిజినెస్ క్లాస్కు బదులుగా ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించాలని అధికారులకు సూచించారు. సమావేశాలు, సెమినార్లు, సమావేశాలకు లగ్జరీ హోటళ్లకు బదులుగా ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని అధికారులకు సూచించబడింది. కరోనా వైరస్ ప్రాభవం వల్ల ఆర్థిక వ్యవస్థను కొంతవరకు కాపాడుకోవడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతోంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : గ్రామస్థులు బహిష్కరించడంతో కారులోనే ఉండిపోయిన యువకుడు