Just In
- 2 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 5 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
లాక్ డౌన్ ఉన్నప్పటికీ తండ్రి కర్మ క్రియలకు వెళ్లిన వ్యక్తి, ఎలా వెళ్లాడంటే.. ?
ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క అతిపెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 14 వరకు మొత్తం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ లాక్ డౌన్ లో భాగంగా భారతదేశంలో అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి. ఇందులో విమాన సేవలు, మెట్రో సేవలు, రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలకు వ్యాపించకుండా ఉండటానికి చాలా రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేయబడ్డాయి.
ఈ లాక్ డౌన్ లో ప్రజలు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అదేవిధంగా వారి సొంత ప్రాంతాలకు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో, తండ్రి చివరి కర్మలు చేయడానికి సుమారు 2,300 కిలోమీటర్లు వెళ్లిన ఒక వ్యక్తికి ప్రత్యేక అనుమతి సంఘటనను గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్కు చెందిన అనింద్యా రాయ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. అందరిలాగే మిస్టర్ రాయ్ కూడా సామాజిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ కి తన మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ గత వారం తన తండ్రి చనిపోయాడని తన తల్లి ఫోన్ చేసి చెప్పింది. అతని తండ్రి కలకత్తా హైకోర్టులో న్యాయవాది ప్రాక్టీస్ చేస్తున్నందున అతని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ లో ఉంటున్నారు.
తన తండ్రి యొక్క చివరి కర్మ క్రియలకు వెళ్ళడానికి మిస్టర్ రాయ్ చాలా గందరగోళం చెందాడు. ప్రస్తుత పరిస్థుల్లో ఈ COVID-19 మహమ్మారి కారణంగా అన్ని దేశీయ విమానాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి. కానీ అతని పరిస్థిని గురించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. ఇతడు దాదాపు అతని తండ్రి కర్మక్రియలకు దాదాపు 2,300 కిలోమీటర్లు ప్రయాణించాలి.
దీనికి ప్రతిస్పందనగా మహారాష్ట్ర రవాణా కమిషనర్ శేఖర్ చన్నే ప్రత్యేక పాస్ జారీ చేశారు, మిస్టర్ రాయ్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం యొక్క సాఫ్ట్ కాపీ వంటి పత్రాలను తయారు చేసిన తరువాత మహారాష్ట్రలో ప్రయాణించడానికి అనుమతించారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్
అధికారుల నుండి ప్రత్యేక పాస్ పొందిన తరువాత మిస్టర్ రాయ్ మరియు అతని స్నేహితుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు పోలీస్ కమిషనర్ ఇచ్చిన పాస్ వల్ల అతని తండ్రి అత్యంక్రియలకు సరైన సమయానికి పాల్గొనటానికి చాలా సహాయపడింది.
MOST READ:ఇండియాలో పెట్రోల్ ఎస్యువి లాంచ్ చేసిన నిస్సాన్
Source: News18