Just In
- 5 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 5 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 6 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 8 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్ డౌన్ ఉన్నప్పటికీ తండ్రి కర్మ క్రియలకు వెళ్లిన వ్యక్తి, ఎలా వెళ్లాడంటే.. ?
ప్రపంచంలోని చాలా దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ యొక్క అతిపెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి భారత ప్రభుత్వం 2020 ఏప్రిల్ 14 వరకు మొత్తం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ లాక్ డౌన్ లో భాగంగా భారతదేశంలో అన్ని సేవలు నిలిపివేయబడ్డాయి. ఇందులో విమాన సేవలు, మెట్రో సేవలు, రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ వ్యాధి ఇతర రాష్ట్రాలకు వ్యాపించకుండా ఉండటానికి చాలా రాష్ట్రాలు తమ సరిహద్దులను మూసివేయబడ్డాయి.
ఈ లాక్ డౌన్ లో ప్రజలు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అదేవిధంగా వారి సొంత ప్రాంతాలకు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో, తండ్రి చివరి కర్మలు చేయడానికి సుమారు 2,300 కిలోమీటర్లు వెళ్లిన ఒక వ్యక్తికి ప్రత్యేక అనుమతి సంఘటనను గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్కు చెందిన అనింద్యా రాయ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. అందరిలాగే మిస్టర్ రాయ్ కూడా సామాజిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ కి తన మద్దతు ప్రకటిస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ గత వారం తన తండ్రి చనిపోయాడని తన తల్లి ఫోన్ చేసి చెప్పింది. అతని తండ్రి కలకత్తా హైకోర్టులో న్యాయవాది ప్రాక్టీస్ చేస్తున్నందున అతని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ లో ఉంటున్నారు.
తన తండ్రి యొక్క చివరి కర్మ క్రియలకు వెళ్ళడానికి మిస్టర్ రాయ్ చాలా గందరగోళం చెందాడు. ప్రస్తుత పరిస్థుల్లో ఈ COVID-19 మహమ్మారి కారణంగా అన్ని దేశీయ విమానాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి. కానీ అతని పరిస్థిని గురించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసాడు. ఇతడు దాదాపు అతని తండ్రి కర్మక్రియలకు దాదాపు 2,300 కిలోమీటర్లు ప్రయాణించాలి.
దీనికి ప్రతిస్పందనగా మహారాష్ట్ర రవాణా కమిషనర్ శేఖర్ చన్నే ప్రత్యేక పాస్ జారీ చేశారు, మిస్టర్ రాయ్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం యొక్క సాఫ్ట్ కాపీ వంటి పత్రాలను తయారు చేసిన తరువాత మహారాష్ట్రలో ప్రయాణించడానికి అనుమతించారు.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : వలస కార్మికులకు వసతిగా మారిన బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్
అధికారుల నుండి ప్రత్యేక పాస్ పొందిన తరువాత మిస్టర్ రాయ్ మరియు అతని స్నేహితుడు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు పోలీస్ కమిషనర్ ఇచ్చిన పాస్ వల్ల అతని తండ్రి అత్యంక్రియలకు సరైన సమయానికి పాల్గొనటానికి చాలా సహాయపడింది.
MOST READ:ఇండియాలో పెట్రోల్ ఎస్యువి లాంచ్ చేసిన నిస్సాన్
Source: News18