Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్
భారతదేశ రహదారులపై అధిక వేగం కారణంగా ప్రతి సంవత్సరం వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది మరణిస్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం వేగంగా డ్రైవింగ్ చేయడం మానడం లేదు.

వేగవంతమైన డ్రైవింగ్ ని అరికట్టడానికి మహారాష్ట్ర పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హైవే పోలీసులు రాబోయే 90 రోజుల్లో కొత్త కెమెరాలను కొనుగోలు చేయనున్నారు. ఈ కెమెరాలు వేగంగా కదిలే వాహనాలను గుర్తించగలవు. ఈ కొత్త కెమెరాలు ప్రస్తుతం ఉన్న కెమెరాల కంటే చాలా అధునాతనమైనవి.

ఈ అధునాతన కెమెరా రెండు లేదా మూడు సందులలో వచ్చే 32 వాహనాలను ఏకకాలంలో పర్యవేక్షిస్తుందని పోలీసులు తెలిపారు. ఈ కొత్త కెమెరాకు రాడార్ స్పీడ్ మెషిన్ (ఆర్ఎస్ఎం) అని పేరు పెట్టారు.
MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్ప్రెస్వే.. చూసారా !

బెంగళూరు, ఢిల్లీలో 155 ఆర్ఎస్ఎం కెమెరాలను కొనుగోలు చేయడానికి టెండర్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించి సమాచారం ప్రకారం హైవేలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనాలపై ఈ హైస్పీడ్ కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. ఇది హైవేల పర్యవేక్షణను సులభతరం చేస్తుంది.

ఈ కెమెరాల కొనుగోలు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 13.95 కోట్లు విడుదల చేసింది. ఈ కెమెరాల కొనుగోలుకు రహదారి భద్రతా నిధితో హైవే పోలీసులు నిధులు సమకూరుస్తారు. ఆర్ఎస్ఎం కెమెరాలు ప్రమాదాల రేటును తగ్గిస్తాయని చెబుతున్నారు.

గణాంకాల ప్రకారం 2019 లో మహారాష్ట్రలో 20,045 రోడ్డు ప్రమాదాలు జరిగాయి, 8,175 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్లు చాలా వేగంగా డ్రైవింగ్ చేయడంవల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఆర్ఎస్ఎం కెమెరాలు వేగంగా కదిలే వాహనాల ఫోటో, స్పీడ్ మరియు రిజిస్టర్ సంఖ్యలను సంగ్రహిస్తాయి. అప్పుడు వాటిని సాక్ష్యంగా ఉపయోగించి దోషులు శిక్షించబడతారు. పోలీసులు ప్రస్తుతం హైస్పీడ్ వాహనాలను ట్రాక్ చేయడానికి లేజర్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
MOST READ:ఈ బుల్లెట్ బాయ్ మామూలోడు కాదు: 11 నెలల్లో 101 తప్పులు; రూ.57,200 ఫైన్