శ్రీవారికి డ్యూరో డిజెడ్ స్కూటర్ను బహుకరించిన మహీంద్రా

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మునిరత్నం రెడ్డికి మహీంద్రా టూవీలర్స్ రీజినల్ మేనేజర్ (ఆంధ్రప్రదేశ్) కె. వెంకటేష్ ఈ స్కూటర్ తాళం చెవులను అందజేశారు.
ఇక డ్యూరో డిజెడ్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇది శక్తివంతమైన 125సీసీ ఇంజన్ను కలిగి ఉండి ఇన్స్టాంట్ పికప్ను అందిస్తుంది. గతుకుల రోడ్లపై సైతం సౌకర్యంగా ప్రయాణించేలా అభివృద్ధి చేసిన మెరుగైన టెలిస్కోపిక్ సస్పెన్షన్, సాటిలేని మైలేజ్, పొడవాటి వీల్బేస్, 20 లీటర్ల అండర్సీట్ స్టోరేజ్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఎన్నో విశిష్ట ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.
అంతేకాకుండా, రాత్రివేళ్ల మంచి కాంతినిచ్చే హాలోజన్ బల్బ్తో కూడిన వెడల్పాటి హెడ్ లైట్, సురక్షితమైన బ్రేకింగ్ కోసం అమర్చిన బ్రేక్ లీవర్ లాక్, వస్తువులను భద్రపరచుకునేందుకు ముందు వైపు స్టోరేజ్ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షనీయమైన ధరకే కంపెనీ ఈ స్కూటర్ను అందిస్తుంది.
ఈ స్కూటర్ ధర రూ.44,640 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది లీటరు పెట్రోల్కు 53 కి.మీ మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








