ఇది చూసారా.. మొబైల్ లైబ్రరీగా మహీంద్రా బొలెరో పిక్-అప్ ట్రక్
మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే, అతడు తన ట్విట్టర్లో ట్వీట్ల ద్వారా కొత్త వీడియోలను పంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆనంద్ మహీంద్రా ఆసక్తికరమైన విషయం గురించి ట్వీట్ చేశారు. ఈసారి మహీంద్రా బొలెరో వాహనం గురించి ట్వీట్ చేశాడు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మహీంద్రా బొలెరో కారు మొబైల్ లైబ్రరీగా మార్చబడింది. ఈ మొబైల్ లైబ్రరీని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారటమే కాకుండా దీనిని వేలాది మంది లైక్ మరియు రీట్వీట్ చేశారు. కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఈ కారు ఓనర్ ని ప్రశంసించారు.

ఈ బొలెరో పిక్-అప్ వాహనంపై లైబ్రరీ నిర్మించబడింది. బొలెరో లైబ్రరీ చిత్రాన్ని పంచుకున్న ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, ఈ బొలెరోలో లైబ్రరీని నిర్మించారు, ఇది నిజంగా కారు యొక్క ఉత్తమ ఉపయోగం.

ఈ చిత్రాన్ని లూధియానాలోని తన స్నేహితుడు మిన్నీ పంచుకున్నారు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఈ బొలెరో గురు గోవింద్ సింగ్ స్టడీ సర్కిల్కు చెందినవాడు. ఇతడే ఈ వాహనాన్ని లైబ్రరీగా మార్చారు.

గురు గోవింద్ సింగ్ స్టడీ సర్కిల్ యువకులను డిజిటల్ వరల్డ్ నుండి పుస్తకాలు చదవడానికి ఉద్దేశించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ట్విట్టర్ వినియోగదారులు ఈ కారు యొక్క ఉద్దేశ్యాన్ని ప్రశంసించారు.

వాస్తవానికి, లైబ్రరీని మహీంద్రా బొలెరో పిక్-అప్ వాహనంపై నిర్మించారు. వాహనం వెనుక ఉన్న వస్తువుల క్యారియర్కు పుస్తకాల ర్యాక్ లు జతచేయబడతాయి. ఈ వాహనంలో స్లైడింగ్ బుక్ అల్మారాలు ఉన్నాయి. ఈ షెల్ఫ్లో ఎక్కువ స్థలం ఉపయోగించబడుతుంది. బుక్ షెల్ఫ్ స్లైడింగ్ను సులభంగా తొలగించి ఇంట్లో ఉంచవచ్చు.

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు డిజిటల్గానే కాకుండా పుస్తకాలు, గ్రంథాలయాల ద్వారా కూడా జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ కార్ ఓనర్ చేసిన ఈ పని నిజంగా ప్రశంసనీయమే కదా..?


Click it and Unblock the Notifications








