కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేస్తున్న బుల్లి కారు.
మహీంద్రా వారి రెవా ఇ20 కారు గురించి మీకు తెలుసా ? ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో మాత్రమే నడుస్తుంది. దీనికి పెట్రోల్, డీజల్ లేదా ఏ సియన్జి గ్యాస్నో నింపాలనే నియమం అస్సలు లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణించే వీలున్న ఈ బుల్లి కారులో ట్రాఫిక్ సమస్య లేకుండా సిటి రోడ్లలో ఎంతో చక్కగా ప్రయాణం చేయవచ్చు.
Also Read: భారత్లో ఎప్పటకీ నెనే ముందు: బుల్లి కారు గొప్ప రికార్డు.
అయితే ఈ బుల్లి కారు ఒక పెద్ద సాహస యాత్ర చేయబోతోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్విరామంగా యాత్ర కొనసాగుతుంది. మహీంద్రా రెవా సాహస యాత్ర గురించి మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

మహీంద్రా రెవా ఇ20 సాహస యాత్రను మహీంద్రా రెవా సిఇఒ అయిన అరవింద్ మ్యాథి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంకకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్ అరంవింద్ డి సిల్వా కూడా పాల్గొన్నారు.

మహీంద్రాకు చెందిన రెవా ఇ20 మూడు కార్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుదూర యాత్రలో పొల్గొననున్నాయి.

ఈ యాత్రలో భాగంగా ఈ మూడు రెవా కార్లు దాదాపుగా 5,000 కిలో మీటర్లు ప్రయాణించనున్నాయి. ఈ యాత్రలో ఇవి 52 ప్రాంతాలను సందర్శించనున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కార్ల వలన వాహనాల కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని మరియు కార్ల ఇంధనాల ధరలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. మరియు ముఖ్యంగా రేపటి తరానికి ఫ్యూయల్ని మిగిలించవచ్చని ఈ సంధర్భంగా తెలిపారు.

మహీంద్రా రెవా ఇ20 కారు 5సి రూల్ని ఫాలో అవుతుందని తెలిపారు అనగా
- 1సి-క్లీన్
- 2సి-కన్వీనియంట్
- 3సి-కనెక్టెడ్
- 4సి-క్లియర్
- 5సి-కాస్ట్ ఎఫెక్టివ్

ఈ మహీంద్రా రెవా ఇ20 కారులో లిథియమ్-ఐయాన్ బ్యాటరీస కలదు. ఈ బ్యాటరీ 3 ఫేస్ ఇండక్షన్ ఎలక్ట్రిక్ మోటార్తో కనెక్ట్ అయిఉంటుంది.

ఈ బ్యాటరీని ఒక సారి ఛార్జ్ చేయగా దాదాపుగా 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

చాలా మంది ప్రస్తుతం కాలుష్యం తగ్గించాలని అనుకుంటుంటారు. ఇలాంటి కార్లను వాడటం దాదాపుగా వాహనాల ద్వారా విడుదల అయ్యే కాలుష్యాన్ని తగ్గించవచ్చని డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.. మరి మీ అభిప్రాయం ఏమిటి ?



Click it and Unblock the Notifications








