Just In
- 12 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 14 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 14 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 16 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Movies Karthika Deepam 2 పారిజాతం కళ్లలో ఆనందం కోసం బంటు.. దీపను మెప్పించిన కార్తీక్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కొంపముంచిన ఓవర్ స్పీడ్.. భారీగా దెబ్బతిన్న మహీంద్రా జైలో[వీడియో]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొంతవరకు తగ్గుముఖం పట్టించి. ఈ కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ లో కొంతవరకు సడలింపులు కూడా జరిపారు. ఈ సడలింపులు కారణంగా వాహనాలు రోడ్డెక్కాయి. వాహనాల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకుంది. కావున ట్రాఫిక్ ఎక్కువయింది.
వాహనాల రాకపోకలు ఎక్కువయితే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువుగా ఉంటుంది. ఇటీవల తమిళనాడులో కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత ప్లై ఓవర్ పై ఒక ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటపడింది.
నివేదికల ప్రకారం సంఘటన తమిళనాడులోని మార్తాండమ్ ఫ్లైఓవర్పై జరిగినట్లు తెలుస్తోంది. రహదారులపైకి వచ్చే వాహనాలను ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ఈ మితిమీరిన వేగమే వారికి ప్రమాదాలను తెస్తోంది.
ఈ వీడియోలో మీరు గమనించినట్లతే అధిక వేగంతో ఫ్లైఓవర్ మీద వెళ్తున్న మహీంద్రా జైలో కారు ఒక్కసారిగా బోల్తా పడింది. కుప్పకూలింది. ఫ్లైఓవర్లోని మరో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు, కానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదం జరగటానికి ప్రధాన కారణం మితిమీరిన వేగం అని అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో కారు భారీగా దెబ్బతినింది. కానీ ఈ కారుకి ఏ స్థాయిలో నష్టం జరిగింది అనే విషయం గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మార్తాండమ్ ఫ్లైఓవర్ ఎలా ఉందొ మీరు ఇక్కడ గమనించవచ్చు.
మార్తాండమ్ ఫ్లైఓవర్ కొంత ఇరుకుగా ఉండటం వల్ల వాహనాలు ఒకదాని వెంట మరొకటి మాత్రమే వెళ్లగలవు. లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. గతంలో కూడా ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయని స్థానికులు అంటున్నారు. కానీ వాహనదారుల అధిక వేగం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఫుట్ఓవర్ వెనుక కదిలే కారులో అమర్చిన కెమెరా సహాయంతో ఇక్కడ మహీంద్రా జైలో కారుకి జరిగిన ప్రమాదం రికార్డ్ చేయబడింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా సిసిటివి కెమెరాలను వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసి నిరంతరం పోలీసులు పర్యవేక్షిస్థిస్తూనే ఉంటారు. అయినప్పయికి ఈ ప్రమాదాలను పూర్తిగా తగ్గించలేకపోతున్నారు.
ప్రపంచంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం మరియు అధికవేగంతో ప్రయాణించడం. అధికవేగంతో ప్రయాణించడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కొన్ని నియమాలను జారీ చేసింది. దీని ప్రకారం వాహనాలు హైవేపై కూడా గంటకు 60-70 కిమీ వేగంతో మాత్రమే వెళ్ళాలి.