Just In
- 10 min ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- 2 hrs ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 2 hrs ago జైలు నుంచి వచ్చాడు.. కోట్లు విలువ చేసే కారు కొన్నాడు - ఎవరో తెలుసా?
- 17 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
Don't Miss
- News రేపు కామద ఏకాదశి.. ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కుమారుడితో సహా 7 మంది దుర్మరణం, ప్రమాదానికి కారణం ఇదే
దేశ వ్యాప్తంగా రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మితిమీరిన వేగం మరియు సీట్ బెల్ట్ ధరించకపోవడం. ఇటీవల బెంగళూరులో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల జరిగిన ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం నిన్న రాత్రి బెంగళూరులోని కోరమంగళ సమీపంలోని మంగళ క్షేత్రానికి దగ్గరలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటలో ఆడి క్యూ3 లగ్జరీ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. రాత్రి సమయంలో మితిమీరిన వేగంతో ప్రయాణించేటప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలిసింది.
Audi Q3 కారు నడుపుతున్న డ్రైవర్ కారుపై కంట్రోల్ తప్పడం వల్ల, లగ్జరీ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ కారులో ముగ్గురు మహిళలు మరియు నలుగురు పురుషులు ఉన్నారు. ఇందులో 6 మంది అక్కడికక్కడే మరణించగా, ఒకరు మాత్రం హాస్పిటల్ చేరిన వెంటనే మరణించాడు. మరణించిన వారి అందరి వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నట్లు తెలిసింది.
ప్రతిదానికి గురైన Audi Q3 కారు నెంబర్ KA 03 MY 6666. కారు ముందు సీటులో చాలా రక్తపు మరకలు ఉన్నాయి. ప్రమాదం అతివేగం వల్ల జరిగిందని చెబుతున్నారు. కారు ఫుట్పాత్ కాటన్ 2 బొల్లార్డ్లను ఢీకొట్టింది. అప్పుడు పక్కనే ఉన్న భవనం గోడ తగిలింది. అదే సమయంలో పోల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ట్రాఫిక్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం అధిక వేగం వల్ల జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ సాగుతోందన్నారు. కావున త్వరలో దీనికి సంబంధించిన మొత్తం సమాచారం తెలుస్తుందని కూడా ఆయన అన్నారు.
దీనిపై విచారణ కొనసాగుతోంది. అతను మధ్యలో తిన్నాడా అని దర్యాప్తు చేయమని నన్ను అడిగారు. నిర్మానుష్యమైన రహదారిపై అధిక వేగంతో నడపబడింది. ముగ్గురు కారు ముందు సీటులో, నలుగురు వెనుక సీట్లో కూర్చున్నారు. కారులో ఉన్న 7 మందిలో ఎవరికీ సీట్ బెల్ట్ లేదు. "కారులోని ఎయిర్ బ్యాగ్ కూడా తెరవలేదు" అని రవికంతేగౌడ చెప్పారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో హోసూరు ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు అరుణాసాగర్ కూడా ఉన్నారు. అంతే కాకుండా అతని భార్య బిందు (28), కేరళకి చెందిన అక్షయ్ గోయల్, ఇషిత (21), ధనుషా (21), హుబ్లీకి చెందిన రోహిత్ మరియు హర్యానాకు చెందిన ఉత్సవ్ ఉన్నారు. వీరందరూ కూడా ప్రాణాలొ కోల్పోయారు. మరణించిన వారిలో కొందరు కోరమంగళ సమీపంలోని పిజిలో నివసిస్తున్నారు.
నివేదికల ప్రకారం, హోసూర్ ఎమ్మెల్యే వైఎస్ ప్రకాష్ కుమారుడు కరుణ సాగర్ రాత్రి పార్టీ ముగించుకుని, అతని భార్య మరియు స్నేహితులతో కలిగి వెళ్ళేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని కూడా చెబుతున్నారు. హోసూరు నియోజకవర్గానికి చెందిన డిఎంకె ఎమ్మెల్యే ప్రకాష్ ఏకైక కుమారుడు కరుణ సాగర్. ఈ కరుణ సాగర్ వయసు 28 ఏళ్ళు.
ఎమ్మెల్యే వై ప్రకాష్ భార్య కొద్ది నెలల క్రితం మరణించారు. ఇప్పుడు వారి ఏకైక కుమారుడు కరుణాసాగర్ కూడా ప్రమాదంలో మరణించాడు. ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయం. మితిమీరిన వేగం ఎంతోమంది జీవితాలను బలిగొంది.
Audi Q3 (ఆడి క్యూ3) విషయానికి వస్తే, ఇది అధునాతన ఫీచర్స్ కలిగిన జర్మనీ లగ్జరీ కారు. కానీ ప్రమాద సమయంలో ఈ ఒక్క ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు. ఇది కారులోని ప్రయాణికుల మరణానానికి ప్రధాన కారణం. ఎందుకంటే కారులో ఎవరూ సీట్ బెల్ట్ ధరించలేదు. కావున ఇందులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు. కొన్ని కార్లలో సీట్ బెల్ట్ ధరిస్తేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది.
సీట్ బెల్ట్ ధరించకపోవడం అనే నిర్లక్ష్యం వల్ల అందరూ ప్రాణాలు కోల్పోయారు. వాహనదారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి సీట్ బెల్ట్ ధరించడం, పరిమిత వేగంతో ప్రయాణించడం వంటివి తప్పకుండా చేయాలి. లేకుంటే ఇటువంటి ప్రమాదాలను ఆహ్వానించినవారు అవుతారు.