విజయ్ మాల్యా ఫోర్స్ ఇండియాకు భారీ జరిమానా

విజయ మాల్యాకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అసలే కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్ వలన పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మాల్యాకు మరో షాక్ తగిలింది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కేసులో 6,50,000 పౌండ్ల (పది లక్షల డాలర్ల)ను చెల్లించాల్సిందిగా బ్రిటీష్ కోర్టు ఫోర్స్ ఇండియాకు ఆర్డర్ జారీ చేసింది. విజయ మాల్యా, సాహారా గ్రూప్‌లు కలిసి ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టీమ్‌‌ను నిర్వహిస్తున్నాయి.

ప్రముఖ రేస్ కార్ల తయారీ సంస్థ క్యాటర్‌హ్యామ్ రేస్ కార్ డిజైన్‌ను ఆధారంగా చేసుకునే ఫోర్స్ ఇండియా రేస్ కార్‌ను అభివృద్ధి చేసిందని క్యాటర్‌హ్యామ్ కోర్టులో దావా వేసింది. అయితే, ఇది అసత్యమని ఫోర్స్ ఇండియా నిరూపించుకోలేకపోయింది. దీంతో సహారా ఫోర్స్ ఇండియా మొత్తం 22 లక్షల డాలర్ల సొమ్మును వదిలించుకోవాల్సి వచ్చింది.

ఫోర్స్ ఇండియా టీమ్‌ను 2007లో సహారా ఇండియా పరివార్, విజయ్ మాల్యాలు కలిసి స్థాపించారు. ఇందులో సహారా ఇండియాకు 42.5 శాతం వాటా ఉంది. టీమ్ లోటస్ టి127 అనే కారును డిజైన్ చేసేటప్పుడు అందులో ఉపయోంగించిన కొన్ని విడిభాగాలు క్యాటర్‌హ్యామ్ హక్కులు సొంతం చేసుకున్న డిజైన్‌లని సదరు కంపెనీ కోర్టుకెక్కింది. గతంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్ లైన్స్‌లోని పెట్టుబడులను సహారా ఫోర్స్ ఇండియాలోకి తరలించినట్లు కూడా విజయ్ మాల్యాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అవేవీ వాస్తవం కాదని కింగ్‌ఫిషర్ కొట్టిపారేసింది.

More from DriveSpark

Article Published On: Monday, May 7, 2012, 17:40 [IST]
English summary
Force India Formula One racing team, owned by Indian business tycoon Vijay Mallya, has been ordered by a British High Court to pay 6,50,000 pounds ($1 million) to rival Formula One team Caterham and their chief technical officer Mike Gascoyne.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+