Just In
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- News
కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
- Movies
రిలీజ్కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్
మనం నిరంతరం సోషల్ మీడియాలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చూస్తూ ఉంటాము. కొంతమంది ప్రజలు కొంత విచిత్రంగా అలోచించి వాటిని అమలుచేస్తూ అందిరిదృష్టిని ఆకర్షిస్తారు. కొంతమంది చేసే పనులు వారికి ప్రశంసలు తెచ్చిపెడితే, మరి కొంతమంది చేసేపనులు వారిని నవ్వుల పాలుచేస్తాయి. ఇదివరకే మనం కొన్ని అద్భుతమైన సంఘటనలు, విచిత్రమైన విశేషాలను గురించి తెలుసుకుని ఉంటాము. అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వచ్చిన ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నివేదికల ప్రకారం కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన కారుకి ఆవు పేడ మరియు బంకమట్టి కలిపిన మిశ్రమాన్ని మిర్రర్స్ మరియు లైట్స్ కి తప్పా మొత్తానికి కవర్ చేసాడు. ఈ కారుతోనే తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్నాడు. ఈ కారు తిరుమలలోని నందకం సమీపంలో పార్క్ చేసాడు.

తిరుమల కొండపై కనిపించిన ఈ కారు చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన చాలామంది ప్రజలు ఆ కారు పోటీలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణంగా ఈ కారు ఫోటోలు అమాంతం వైరల్ అవుతోంది.

ఆ కారు యజమానిని ఎందుకు ఈవిధంగా చేసావని అడిగినప్పుడు, ప్రస్తుతం అధికంగా ఉన్న ఎండా తీవ్రతను తట్టుకోవడానికి మరియు కారులో చల్లదనం కోసం ఈ విధంగా చేసినట్లు చెప్పాడు. దీనిపై చాలామంది తీవ్రంగా విమర్శించారు. కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.

అయితే కొంతమంది మాత్రమే యితడు చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఆవు హిందువులకు పూజ్యనీయం, కావున ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కావున ఈవిధంగా చేయడం తప్పుకాదని, అతనిని ప్రశంసించారు.
MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్

ఆవుపేడ ఎంత శాస్త్రీయమయినప్పటికి అది కారుకి తుప్పుపట్టేలా చేస్తుందని, కావున ఈ విధంగా చేస్తే కారు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కారుకి ఆవు పేడ బంకమట్టి మిశ్రమం పూయడం వల్ల చాలా బిన్నంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

దీనిని బట్టి చూస్తే నింజంగా మనుసులనుకున్న కళాపోషణ అంతా, ఇంతా కాదండోయ్ బాబు, అని తప్పకుండా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి చేసిన చేసిన ఈ పనికి తన కారు సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయిపోయింది. ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కార్లకు ఆవుపేడ కోటింగ్ ఇవ్వడం ఇదే సారికాదు, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా వెలుగులోకి వచ్చాయి, సంభందించిన ఫోటోలు పైన చూడవచ్చు.
MOST READ:గిఫ్ట్గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?
Source: Samayam