Just In
- 11 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 13 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 16 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్
మనం నిరంతరం సోషల్ మీడియాలో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చూస్తూ ఉంటాము. కొంతమంది ప్రజలు కొంత విచిత్రంగా అలోచించి వాటిని అమలుచేస్తూ అందిరిదృష్టిని ఆకర్షిస్తారు. కొంతమంది చేసే పనులు వారికి ప్రశంసలు తెచ్చిపెడితే, మరి కొంతమంది చేసేపనులు వారిని నవ్వుల పాలుచేస్తాయి. ఇదివరకే మనం కొన్ని అద్భుతమైన సంఘటనలు, విచిత్రమైన విశేషాలను గురించి తెలుసుకుని ఉంటాము. అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వచ్చిన ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నివేదికల ప్రకారం కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి తన కారుకి ఆవు పేడ మరియు బంకమట్టి కలిపిన మిశ్రమాన్ని మిర్రర్స్ మరియు లైట్స్ కి తప్పా మొత్తానికి కవర్ చేసాడు. ఈ కారుతోనే తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకున్నాడు. ఈ కారు తిరుమలలోని నందకం సమీపంలో పార్క్ చేసాడు.
తిరుమల కొండపై కనిపించిన ఈ కారు చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీనిని చూసిన చాలామంది ప్రజలు ఆ కారు పోటీలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణంగా ఈ కారు ఫోటోలు అమాంతం వైరల్ అవుతోంది.
ఆ కారు యజమానిని ఎందుకు ఈవిధంగా చేసావని అడిగినప్పుడు, ప్రస్తుతం అధికంగా ఉన్న ఎండా తీవ్రతను తట్టుకోవడానికి మరియు కారులో చల్లదనం కోసం ఈ విధంగా చేసినట్లు చెప్పాడు. దీనిపై చాలామంది తీవ్రంగా విమర్శించారు. కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.
అయితే కొంతమంది మాత్రమే యితడు చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఆవు హిందువులకు పూజ్యనీయం, కావున ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కావున ఈవిధంగా చేయడం తప్పుకాదని, అతనిని ప్రశంసించారు.
MOST READ:గుండె తరుక్కుపోయే వీడియో.. ముందు బాక్స్లో పాప, వెనుక డెలివరీ మెటీరియల్
ఆవుపేడ ఎంత శాస్త్రీయమయినప్పటికి అది కారుకి తుప్పుపట్టేలా చేస్తుందని, కావున ఈ విధంగా చేస్తే కారు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కారుకి ఆవు పేడ బంకమట్టి మిశ్రమం పూయడం వల్ల చాలా బిన్నంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
దీనిని బట్టి చూస్తే నింజంగా మనుసులనుకున్న కళాపోషణ అంతా, ఇంతా కాదండోయ్ బాబు, అని తప్పకుండా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి చేసిన చేసిన ఈ పనికి తన కారు సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయిపోయింది. ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కార్లకు ఆవుపేడ కోటింగ్ ఇవ్వడం ఇదే సారికాదు, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా వెలుగులోకి వచ్చాయి, సంభందించిన ఫోటోలు పైన చూడవచ్చు.
MOST READ:గిఫ్ట్గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?
Source: Samayam