Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 18 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Movies Brahmamudi April 26th episode: నా కూతురుకు అడ్డుకొనే పరిస్థితి రానివ్వను.. కనకం ఫైర్
- News ఈసారి అక్షయ తృతీయ నాడే బోలెడు శుభయోగాలు.. ఇలా చేసినవారికి ధనయోగం
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి
కరోనా వైరస్ ప్రభావం వల్ల ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో లాక్డౌన్ అమలు చేయబడింది. ప్రస్తుతం కొన్ని నగరాలలో లాక్డౌన్ మినహాయింపు ఇవ్వగా, మరి కొన్నింటిలో లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక వ్యక్తికి ఇటీవల మిలియన్ల రూపాయల జరిమానా విధించబడింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నివాసి బటర్ చికెన్ తినాలనుకున్నాడు. బటర్ చికెన్ తినాలనే కోరిక కారణంగా అతను తన ఇంటి నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీ సెంటర్ వైపు వెళ్ళాడు. పోలీసులు అతన్ని ఆపి $ 1652 జరిమానా విధించారు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా టెరిటరీలో ఇప్పటికి లాక్డౌన్ అమలులో ఉంది. ఈ కారణంగా అవసరమైన వస్తువుల షాప్ లు మాత్రమే ఓపెన్ చేయబడ్డాయి. కానీ ఒకే చోట ప్రజలు గుంపుగా చేరటం ఇప్పటికి నిషేధం. రద్దీ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఇంటి వద్దే ఉండాలని అధికారులు నగరవాసులను ఆదేశించారు.
MOST READ:మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి
ఇప్పటికి చాలామంది ప్రజలు దీనిని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం విధించిన నియమాలను అనుసరించకుండా బయట తిరగటం వల్ల కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ కారణంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా లాక్డౌన్ ఉల్లంఘించిన వారిలో ఇప్పుడు చిక్కుకున్న వ్యక్తి కూడా ఉన్నారు. బటర్ చికెన్ కోసం 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆ యువకుడికి పోలీసులకు జరిమానా విధించారు. కరోనా రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో ప్రజలు బయట రావడం మంచిది కాదు.
MOST READ:అద్భుతంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్ చూసారా..?
లాక్డౌన్ మొదలుపెట్టిన కేవలం 2 గంటల వ్యవధిలో 24 మంది పోలీసులుకు పట్టుబట్టారు. మొత్తం 24 గంటల్లో 13,000 వాహనాలను తనిఖీ చేసినట్లు వర్గాలు తెలిపాయి. బటర్ చికెన్ కోసం వెళ్లిన వ్యక్తి స్టోరీ ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. చాలామంది సిటిజన్ లు దీనిపై కామెంట్లు కూడా చేస్తున్నారు.
బటర్ చికెన్ కోసం వెళ్లిన వ్యక్తి నుంచి $ 1652 జరిమానా విధించారు. బటర్ చికెన్ కోసం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అమౌంట్ ఇదే అని ట్రోల్ చేయబడుతోంది. కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ప్రజలు నిరంతరం బయపడుతున్నప్పటికీ కొంతమంది ఏ మాత్రం లెక్క చేయకుండా విచ్చల విడిగా తిరుగుతున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించినప్పుడు మాత్రమే కరోనా మహమ్మారిని కొంత వరకు నివారించగలుగుతాము.
MOST READ:కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో