Just In
- 6 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే మనదేశంలో కోన్ని నగరాలలో పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఒక సంఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన క్రికెటర్ కి అవార్డుగా 5 లీటర్ల పెట్రోల్ బహుమతిగా ఇచ్చారు. ఈ మ్యాచ్ గత ఆదివారం జరిగినట్లు తెలిసింది. సలావుద్దీన్ అబ్బాసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
సాధారణంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు కార్ లేదా బైక్ వంటివి ఇవ్వడం తెలుసు, కానీ ఇక్కడ దానికి భిన్నంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అతనికి 5 లీటర్ల పెట్రోల్ ఇచ్చారు. భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను ఎత్తిచూపడానికి మరియు పెరుగుతున్న ధరలకు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది.
భారతదేశంలో ఇలాంటి వింత సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, బంధువులు మరియు స్నేహితులు పెళ్లిళ్లలో కొత్త జంటకు పెట్రోల్ బహుమతిగా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు చూడటానికి సరదాగా ఉన్నప్పటికీ, వాహనదారులు పెట్రోల్ మరియు డీజిల్ ధరల గురించి చాలా అవస్థలు పడుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ మరియు సిఎన్జి వాహనాలను కొనుగోలుచేయడానికి చాలా ఆసక్తి కనపరుస్తున్నారు.
MOST READ:సర్ప్రైజ్.. 'అంబాసిడర్' బ్రాండ్ని తిరిగి భారత్లో ప్రవేశపెట్టనున్న సిట్రోయెన్
ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు వివిధ రకాల తగ్గింపులను కూడా అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వెంటనే కొనుగోలు చేయలేని వారు ప్రస్తుతం ఉన్న వాహనం యొక్క మైలేజీని పెంచే పనిలో ఉన్నారు. కొన్ని నగరాల్లో గ్యారేజీలు ఎక్కువ బిజీగా ఉండటానికి ఇది దారితీసింది.
ప్రస్తుతం మైలేజ్ ఎక్కువ అందించే బైకులను కొనడాటానికి కూడా ఎక్కువమంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. కావున అధిక మైలేజ్ ఇచ్చే వాహన అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల శీతాకాలం ముగిసే నాటికి ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]
ఏది ఏమైనా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపాలిట శాపంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాలు ఉన్నాయి. ఈ విధమైన ధరల పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కావున ప్రభుత్వం కూడా దీనిపై తగైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.