Just In
- 9 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 10 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 11 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 12 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా
మన దేశంలో రోజు రోజుకి వాహన దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. దేశవ్యాప్తంగా కార్లు మరియు బైక్ దొంగతనాలా గురించి అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వాహన దొంగతనాలను పూర్తిగా నిలువరింవచలేకపోతున్నారు. వాహన తయారీదారులు ఎన్ని అధునాతన టెక్నాలజీలు అందిస్తున్నప్పటికీ వాహన దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సాధారణంగా వాహన దొంగతనాలు మాత్రమే కాకుండా వాహనాలకు సంబంధించి బడా మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఆన్లైన్ కార్ల అమ్మకపు ప్లాట్ఫామ్ OLX ఉపయోగించి ఒకే కారును వేర్వేరు వినియోగదారులకు విక్రయిస్తున్న వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిందని, ఈ వ్యక్తి పేరు మను అని పిలవబడే మనోట్టం త్యాగి.
నిందితుడైన మనోట్టం త్యాగి కనీసం 14 సార్లు రెండు కార్లను వేర్వేరు విక్రేతలకు విక్రయించాడని ఆరోపించబడింది. మను మొరుతాబాద్లో నివసిస్తున్న స్నేహితుడికి మారుతి వాగన్ఆర్ను విక్రయించాడు. ఇది కాకుండా, మారుతి స్విఫ్ట్ డిజైర్ కూడా పట్టుబడటానికి ముందే విక్రయించబడింది.
MOST READ:దేశీయ మార్కెట్లో టీవీఎస్ అపాచీ RTR 200 4V బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
నిందితుడు మనోట్టం త్యాగి కనీసం 14 సార్లు రెండు కార్లను వేర్వేరు విక్రేతలకు విక్రయించాడని ఆరోపించారు. మను ఒక మొరుతాబాద్లో నివసిస్తున్న స్నేహితుడికి మారుతి వాగన్ఆర్ను విక్రయించాడు. ఇది కాకుండా, మారుతి స్విఫ్ట్ డిజైర్ కూడా పట్టుబడటానికి ముందే విక్రయించబడింది.
మను సాధారణంగా కారును అప్పగించే ముందు కారు లోపల జిపిఎస్ ట్రాకర్ను ఉంచుతారు. అతను కస్టమర్ కి కారు యొక్క ఒక కీని మాత్రమే ఇచ్చాడు. అతను కారును విక్రయించిన తర్వాత, అతను కారు యొక్క స్థానాన్ని ట్రాక్ చేసి, తన వద్ద ఉన్న రెండవ కీని ఉపయోగించుకుని దొంగిలించేవాడు.
MOST READ:త్వరపడండి.. దీపావళి సందర్భంగా బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్పై భారీ ఆఫర్స్
యూస్డ్ కార్స్ డీలర్ జీతు యాదవ్తో కూడా అతను అదే పని చేశాడు. మను మారుతి వాగన్ఆర్ ను రూ. 2.7 లక్షలకు అమ్మారు మరియు ఆ రాత్రి డీలర్ ఇంటి నుండి కారు దొంగిలించబడింది. తరువాత మను ఇటీవల అదే వాగన్ఆర్ చిత్రాన్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.
ఈ చిత్రాలను చూసిన జీతు యాదవ్ స్నేహితుడు ప్రదీప్ కారును గుర్తించాడు. అనంతరం వారు ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మరియు పోలీసులు ప్రదీప్ సహాయంతో మనును అరెస్టు చేశారు. ఏది ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ కొనే తప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇలాంటి మోసాలను ఎదుర్కోవలసి వస్తుంది.
Source: TOI
MOST READ:నవంబర్ 7 న 6 నగరాల్లో లాంచ్ కానున్న ఏథర్ 450 ఎక్స్ ; ఆ నగరాలు ఇవే