Just In
- 23 min ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 2 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 6 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 8 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
కరోనా మహమ్మరి రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా అధికంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారిన పడిన చాలామంది ప్రజలు మరణించారు, ఇంకొంతమంది ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరోనా వైరస్ ప్రపంచాన్నే కుదిపివేసింది.
కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా వైరస్ కేసులను చాలావరకు నియంత్రించవచ్చు.
కరోనా నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చినప్పటికీ దీనిని చాలామంది ప్రజలు పెడచెవినపెడుతున్నారు. ఈ కారణంగా పోలీసులు వీరిపై నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా నైట్ కర్ఫ్యూ సమయంలో వాహనాలను కూడా జప్తుచేస్తున్నారు.
MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్కి ఇది తప్పని సరి.. లేకుంటే?
కరోనా నైట్ కర్ఫ్యూ విధించిన కేవలం ఒక్కరోజులో కర్ణాటకలో దాదాపు 68 వాహనాలు జప్తుచేయబడ్డాయి. ఇది కూడా కర్ణాటకలోని మనగలూరులో ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 64 ద్విచక్ర వాహనాలుఉన్నాయి.
ఇటీవల జరిగిన ఈ చర్యకు సంబంధించిన వీడియో బయటపడింది. ఈ వీడియోలో ఒక సీనియర్ అధికారి తన జూనియర్ పోలీసు సిబ్బంది సహాయంతో వాహనాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకోవడం చూడవచ్చు. నగరం అంతటా 42 అవుట్పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు.
MOST READ:సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?
ఈ పోస్టుల వద్ద వాహనదారులను ఆపి, సరైన పత్రాలు చూపించమని కోరారు. కొంతమందికి చెల్లుబాటు అయ్యే పత్రాలు చూపించిన తర్వాత మాత్రమే రాత్రి 10 గంటల తరువాత ప్రయాణించడానికి అనుమతించారు. ఈ కారణంగా కొంతమంది రాత్రి 10 గంటల తరువాత బయలుదేరడానికి అనుమతించనందున తమ కోపాన్ని వ్యక్తం చేశారు.
కొంతమంది ప్రజలు నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసి ఇంటికి వెతున్నప్పుడు వారి ఐడి-కార్డు చూపించినప్పటికీ అతన్ని బయలుదేరటానికి అనుమతించబడలేదు. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా మాజీ మంత్రి బి.సి. రామనాథ్ రాయ్ మంగళూరు శివార్లలోని పాడిల్పై బారికేడ్లు వేసి వాహనాలను ఆపుతున్నారని విమర్శించారు.
MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్కు జరిమానా; పూర్తి వివరాలు
ఆ సమయంలో కొంతసేపటి తర్వాత రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ జామ్ను గమనించి తన కారు నుంచి బయటకు వచ్చి బారికేడ్లను తొలగించాలని పోలీసు అధికారులను కోరారు. దేశం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతోంది, ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమైనదిగా రుజువైంది.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని నియంత్రించడానికి పోలీసులు నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. దీని కింద రాత్రి 10 గంటల తర్వాత అన్ని మునుపటికంటే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో అనవసరమైన ప్రయాణాన్ని తగ్గించడానికి వీలుగా వాహనదారులకు ప్రయాణానికి అత్యవసర కారణం అడిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
MOST READ:బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..
కరోనా నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కావున దీనిని అందరు ప్రజలు తప్పకుండా గమనించాలి. కావున కరోనా మహమ్మరి తొలగించడంలో ప్రభుత్వాలు చేస్తున్న ఈ తీవ్రమైన కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం తెలపాలి. అప్పుడే కరోనా నివారణకు అనుకూలంగా ఉంటుది.
Image Courtesy: e mungaru