Just In
- 8 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 8 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 10 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 11 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
కరోనా మహమ్మరి రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా అధికంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారిన పడిన చాలామంది ప్రజలు మరణించారు, ఇంకొంతమంది ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరోనా వైరస్ ప్రపంచాన్నే కుదిపివేసింది.
కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఇప్పటికే మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా వైరస్ కేసులను చాలావరకు నియంత్రించవచ్చు.
కరోనా నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చినప్పటికీ దీనిని చాలామంది ప్రజలు పెడచెవినపెడుతున్నారు. ఈ కారణంగా పోలీసులు వీరిపై నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా నైట్ కర్ఫ్యూ సమయంలో వాహనాలను కూడా జప్తుచేస్తున్నారు.
MOST READ:బ్రేకింగ్ న్యూస్; బెంగళూరులో తిరగాలంటే మీ బైక్కి ఇది తప్పని సరి.. లేకుంటే?
కరోనా నైట్ కర్ఫ్యూ విధించిన కేవలం ఒక్కరోజులో కర్ణాటకలో దాదాపు 68 వాహనాలు జప్తుచేయబడ్డాయి. ఇది కూడా కర్ణాటకలోని మనగలూరులో ఈ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 64 ద్విచక్ర వాహనాలుఉన్నాయి.
ఇటీవల జరిగిన ఈ చర్యకు సంబంధించిన వీడియో బయటపడింది. ఈ వీడియోలో ఒక సీనియర్ అధికారి తన జూనియర్ పోలీసు సిబ్బంది సహాయంతో వాహనాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకోవడం చూడవచ్చు. నగరం అంతటా 42 అవుట్పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు.
MOST READ:సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పోలీసులచే అరెస్ట్ అయ్యాడు.. ఎందుకంటే?
ఈ పోస్టుల వద్ద వాహనదారులను ఆపి, సరైన పత్రాలు చూపించమని కోరారు. కొంతమందికి చెల్లుబాటు అయ్యే పత్రాలు చూపించిన తర్వాత మాత్రమే రాత్రి 10 గంటల తరువాత ప్రయాణించడానికి అనుమతించారు. ఈ కారణంగా కొంతమంది రాత్రి 10 గంటల తరువాత బయలుదేరడానికి అనుమతించనందున తమ కోపాన్ని వ్యక్తం చేశారు.
కొంతమంది ప్రజలు నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసి ఇంటికి వెతున్నప్పుడు వారి ఐడి-కార్డు చూపించినప్పటికీ అతన్ని బయలుదేరటానికి అనుమతించబడలేదు. సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా మాజీ మంత్రి బి.సి. రామనాథ్ రాయ్ మంగళూరు శివార్లలోని పాడిల్పై బారికేడ్లు వేసి వాహనాలను ఆపుతున్నారని విమర్శించారు.
MOST READ:ఫేస్ మాస్క్ లేనందుకు గవర్నమెంట్ బస్ డ్రైవర్కు జరిమానా; పూర్తి వివరాలు
ఆ సమయంలో కొంతసేపటి తర్వాత రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ జామ్ను గమనించి తన కారు నుంచి బయటకు వచ్చి బారికేడ్లను తొలగించాలని పోలీసు అధికారులను కోరారు. దేశం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారితో పోరాడుతోంది, ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరమైనదిగా రుజువైంది.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని నియంత్రించడానికి పోలీసులు నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. దీని కింద రాత్రి 10 గంటల తర్వాత అన్ని మునుపటికంటే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో అనవసరమైన ప్రయాణాన్ని తగ్గించడానికి వీలుగా వాహనదారులకు ప్రయాణానికి అత్యవసర కారణం అడిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
MOST READ:బెంట్లీ కార్స్ మాత్రమే కాదు, ఇక బెంట్లీ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా..
కరోనా నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కావున దీనిని అందరు ప్రజలు తప్పకుండా గమనించాలి. కావున కరోనా మహమ్మరి తొలగించడంలో ప్రభుత్వాలు చేస్తున్న ఈ తీవ్రమైన కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం తెలపాలి. అప్పుడే కరోనా నివారణకు అనుకూలంగా ఉంటుది.
Image Courtesy: e mungaru