నదిలో చెత్తవేసిన మహిళకు సరైన గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఇంతకీ ఏం చేసారంటే?
భారతదేశంలో నదులను చాలా పవిత్రంగా చూస్తారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే మనదేశంలో కొంతమంది చాలావరకు వీటిని వ్యర్దాలను వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ వీరిని పూర్తిగా నిలువరించలేకపోతున్నారు.

ఇటీవల మంగుళూరులో ఒక మహిళ చెత్తను నదిలోకి వేయడం వల్ల ఆమెపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మంగళూరుకి చెందిన మహిళ చెత్తను నదిలోకి విసిరిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేత్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జ్ పై ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోలో బ్రిడ్జ్ పై నిలబడిన మహిళ చెత్తను నదిలో వేయడం మనం చూడవచ్చు. ఈ వీడియోలో మహిళా తన హ్యుందాయ్ వెర్నా కారులో వచ్చి చెత్తను నదిలో వేయడం కూడా గమనించవచ్చు.

ఈ వీడియోలో కారు నుంచి దిగిన మరో మహిళను కూడా చూడవచ్చు. చెత్తను నదిలోకి విసిరిన తరువాత, ఇద్దరూ అక్కడనుంచి వెళ్లిపోతారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒక సామజిక కార్యకర్త సోషల్ నెట్వర్క్ సైట్ లో అప్లోడ్ చేశారు.

సోషల్ నెట్వర్క్ సైట్ లో అప్లోడ్ చేసిన వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయ్యింది. ఈ వీడియో వైరల్ అయిన తరువాత పోలీసులు హ్యుందాయ్ వెర్నా కారును స్వాధీనం చేసుకున్నారు. వీడియో చూసిన ప్రజలు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు పాల్పడిన మహిళను గుర్తించడంలో అధికారులకు ఎటువంటి సమస్య లేదు, ఎందుకంటే వీడియోలో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ చర్యకు పాల్పడిన మహిళపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ హ్యుందాయ్ వెర్నా కారును పోలీస్ స్టేషన్ వద్ద ఆపి ఉంచారు. భారతదేశంలోని నదులు చాలా పవిత్రంగా భావిస్తారు కావున, నదుల్లో చెత్తవేయడం వేయడం చట్టవిరుద్ధం.

ఇలా ప్రజలు మాత్రమే కాదు కొన్ని ఫ్యాక్టరీలు కూడా తమ ఫ్యాక్టరీల నుంచి వచ్చే చెత్తను మరియు వ్యర్థాలను నదుల్లోకి వదిలేస్తున్నారు. ఇవన్నీ నదులను మరింత కలుషితం చేస్తుంది. ఆ నదులని నీటిని తాగే వారు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.ప్రజలు మాత్రమే కాదు అక్కడి జలచరాలు, జంతువులకు ప్రాణహాని కూడా ఉంది.
ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నదులు భారతదేశంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నదులలో చెత్తను నిషేధించాయి. భారతదేశంలో నదికి అడ్డంగా నిర్మించిన బ్రిడ్జిలపై ఎత్తైన కంచె వంటి నిర్మాణాలు నిర్మించబడ్డాయి. ఈ కంచెల వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు చెత్తను నదులలోకి వేయకుండా నిషేధించడం.

ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు చెత్తవేయడం మానడం లేదు, ఇప్పటికి కూడా చెత్త వేస్తూనే ఉన్నారు అనడానికి నిదర్శనం ఈ వీడియో. నది కలుషితం కావడానికి కారకులైన ప్రజలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతిలోని వీటిని కలుషితం చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ పర్యవరం మనకందించి ఆస్తి, కావున వీటిని తరువాత తరాలకు కూడా మనం అందించాలి.


Click it and Unblock the Notifications








