మారుతి సుజుకీ అదిరిపోయే ప్లాన్.. 5 లక్షల కార్లను రైలులో పంపి 63లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా
ప్రస్తుతం భారతదేశంలో కార్ల మార్కెట్లో మారుతి సుజుకి అమ్మకాల్లో నంబర్ వన్. లాభాల కోసం మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా కూడా మారుతి జాగ్రత్త పడుతుంది. కస్టమర్లే తమకు రాజులు అని నమ్మే ఈ కంపెనీ, ఇప్పుడు ఒక సంచలన వార్తను బయటపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే ద్వారా ఏకంగా 5లక్షల కార్లను రవాణా చేసినట్లు తెలిపింది. దీని వల్ల మారుతికి ఎంత లాభమో తెలుసుకుందాం.
అమ్మకాల్లో మార్కెటింగ్లో మారుతి సుజుకి ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. కేవలం లాభాల కోసం మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని జరగకుండా ఉండే పనులు చేయడానికి కూడా మారుతి జాగ్రత్త పడుతుంది.

భారతీయ వాహన మార్కెట్లో 50 శాతం వాటాను కలిగి ఉన్న ఈ దిగ్గజం, ఇండియన్ రైల్వేస్ సరుకు రవాణా వ్యవస్థను ఎంతగా ఉపయోగించుకుందో చూపే నివేదికలను విడుదల చేసింది. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రైల్వే ద్వారా ఐదు లక్షల వాహనాలను రవాణా చేసింది.
ఇండియన్ రైల్వే సాయంతో వాహనాలను రవాణా చేయడం వల్ల 180,000 టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగారు. అంతేకాకుండా, 63 మిలియన్ లీటర్లకు పైగా ఇంధనాన్ని ఆదా చేయగలిగారు అని మారుతి సుజుకి లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 600 నగరాలకు మారుతి రైలు మార్గం ద్వారా వాహనాలను చేరవేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలుష్యాన్ని తగ్గించగలుగుతున్నారు అనేది ఒక ప్రత్యేకత.

మారుతి సుజుకి అమ్మకాల లెక్కలు చూస్తే.. 2025మే నెలలో 13,584యూనిట్ల అమ్మకాలతో మారుతికి చెందిన క్రాస్ఓవర్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది. 2024 మే నెలలో 12,681యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం వృద్ధి. మారుతికి చెందిన టాల్బాయ్ హ్యాచ్బ్యాక్ అయిన వ్యాగన్ఆర్ 13,949యూనిట్ల అమ్మకాలతో ఏడవ స్థానంలో ఉంది. అయితే, 12నెలల క్రితం 14,492మంది కొత్త కస్టమర్లను పొందిన ఈ కారు అమ్మకాలు 4 శాతం తగ్గాయి.
2024 మే నెలలో 19,393 యూనిట్ల అమ్మకాలు సాధించిన మారుతి సుజుకి స్విఫ్ట్ భారీ పతనాన్ని (27 శాతం) చవిచూసింది. గత నెలలో స్విఫ్ట్ కేవలం 14,135 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. 2024 మే నెలలో 14,186 యూనిట్లు అమ్ముడైన మారుతికి చెందిన సబ్-4 మీటర్ ఎస్యూవీ అయిన బ్రెజా, గత నెలలో అమ్మకాలను 15,566 యూనిట్లకు పెంచుకొని మూడవ స్థానానికి చేరుకుంది.

గత నెలలో మారుతి టయోటాకు అందించిన వాహనాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2024 మే నెలలో 10,490 యూనిట్ల నుండి 10,168 యూనిట్లకు అమ్మకాలు తగ్గాయి. అయితే, వివిధ విభాగాలలో వచ్చిన ఈ తగ్గుదలను మారుతి, ఎగుమతులలోసాధించిన అద్భుతమైన వృద్ధి ద్వారా అధిగమించింది.
2025 మే నెలలో మారుతి ఎగుమతులు 80శాతం పెరిగాయి. 2025 మే నెలలో కంపెనీ 31,219 వాహనాలను విదేశాలకు పంపింది. గత సంవత్సరం మేలో ఇది కేవలం 17,367 యూనిట్లు మాత్రమే.

గ్రాండ్ విటారా ఆధారంగా కొత్త మారుతి 7 సీటర్ ఎస్యూవీ రాబోతోందని అనేక నివేదికలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మారుతి చైర్మన్ ఆర్.సి.భార్గవ..ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి కొత్త ఎస్యూవీని విడుదల చేస్తుందని ధృవీకరించారు. మారుతి సుజుకి ప్రజల కోసం కొత్త ఐదు సీట్ల ఎస్యూవీని ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తోంది.
మారుతి Y17 కంపెనీ ఎస్యూవీ సిరీస్లో బ్రెజా కంటే పైన, గ్రాండ్ విటారా కంటే కింద స్థానం పొందుతుంది. గత సంవత్సరమే మారుతి భారతదేశంలో 'ఎస్కూడో' అనే పేరును ట్రేడ్మార్క్ చేసింది. సుజుకి స్వదేశమైన జపాన్తో సహా అనేక విదేశీ మార్కెట్లలో గ్రాండ్ విటారా ఈ పేరుతోనే అమ్ముడవుతోంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: మారుతి సుజుకి కేవలం అమ్మకాలలో మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో కూడా తమ వంతు కృషి చేస్తోంది. రైల్వే ద్వారా కార్ల రవాణా అనేది ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. కొత్త ఎస్యూవీల విడుదల, ముఖ్యంగా 7 సీటర్ మోడల్, మారుతి మార్కెట్ వాటాను మరింత పెంచుతుందని ఆశిస్తున్నాం.


Click it and Unblock the Notifications








