కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి
భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కట్టుదిట్టమైన చర్యలకు అనుకూలంగా ప్రవర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటి పరిస్థితుల్లో సామజిక దూరం ప్రజలకు చాలా అవసరం.

లాక్ డౌన్ కారణంగా దాదాపు ప్రజలందరూ కచ్చితంగా సామజిక దూరాన్ని పాటించాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మరి భారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన 39 ఏళ్ల పార్థ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ ఒక వాహనాన్ని తయారుచేసాడు. పార్థ టీవీ షాపులో మెకానిక్గా పనిచేస్తున్నాడు.

కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి పార్థ ఒక బైక్ను నిర్మించాడు. ఈ బైక్ విస్తృతంగా అందరిచేత ఆకర్శించబడింది. దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ సంక్రమణ వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వైరస్ సంక్రమణ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే భయంతో వారు రద్దీ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో తమ 8 సంవత్సరాల కుమార్తెను రద్దీగా ఉండే బస్సులో పంపించడం సరైనది కాదని నిర్ణయించుకున్నాడు.

పార్థ ఈ విధమైన దానికి తగిన పరిస్కారంగా ఒక కొత్త తరహా బైక్ రూపకల్పన చేశారు. ఈ బైక్పై ఉన్న సామాజిక అంతరాన్ని తగ్గించి అతడు తమ కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ బైక్ను ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క రెండు సీట్ల మధ్య మీటర్ గ్యాప్ ఉంచారు.

లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించినప్పుడు, లాక్డౌన్ త్వరలో ముగియదని వారు అర్థం చేసుకున్నారు. తమ కుమార్తెను బస్సులో బడికి పంపించకూడదని నిర్ణయించుకున్నప్పుడు అందులోనుంచి పుట్టిన ఆలోచనే ఈ కొత్త సామజిక దూరాన్ని తలపించే బైక్.

కరోనా లాక్ డౌన్ కారణంగా తన కుమార్తెను బడికి పంపడానికి ఆలస్యం చేయకుండా ఆదా చేసిన డబ్బుతో పాత బైక్ భాగాలను కొనుగోలు చేస్తూ ఈ బైక్ రూపకల్పన ప్రారంభించాడు. ఇది బ్యాటరీల సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్. దీనికి 1.2 మీటర్లు (3.2 అడుగులు) ఇనుప రాడ్ అమర్చారు. ఇది బైక్ యొక్క పొడవును పెంచడం వల్ల సామాజిక దూరం పెరుగుతుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత బైక్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 40 కి.మీ.

రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా ఈ బైక్ వైపు చూస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పార్థ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఇటీవల ఒక ఇ-రిక్షా డ్రైవర్ తన రిక్షాలో ప్రయాణీకుల కోసం నాలుగు క్యాబిన్లను తయారుచేశాడు, సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యత పట్ల అందరికి అవగాహన కల్పించారు.


Click it and Unblock the Notifications








