Just In
- 2 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 4 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 5 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 8 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి
భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కట్టుదిట్టమైన చర్యలకు అనుకూలంగా ప్రవర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటి పరిస్థితుల్లో సామజిక దూరం ప్రజలకు చాలా అవసరం.
లాక్ డౌన్ కారణంగా దాదాపు ప్రజలందరూ కచ్చితంగా సామజిక దూరాన్ని పాటించాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మరి భారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన 39 ఏళ్ల పార్థ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ ఒక వాహనాన్ని తయారుచేసాడు. పార్థ టీవీ షాపులో మెకానిక్గా పనిచేస్తున్నాడు.
కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి పార్థ ఒక బైక్ను నిర్మించాడు. ఈ బైక్ విస్తృతంగా అందరిచేత ఆకర్శించబడింది. దేశవ్యాప్తంగా వ్యాపించిన కరోనావైరస్ సంక్రమణ వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వైరస్ సంక్రమణ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందనే భయంతో వారు రద్దీ ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో తమ 8 సంవత్సరాల కుమార్తెను రద్దీగా ఉండే బస్సులో పంపించడం సరైనది కాదని నిర్ణయించుకున్నాడు.
MOST READ:గుడ్ న్యూస్.. కరోనా నుంచి కాపాడే రోబో వచ్చేసింది
పార్థ ఈ విధమైన దానికి తగిన పరిస్కారంగా ఒక కొత్త తరహా బైక్ రూపకల్పన చేశారు. ఈ బైక్పై ఉన్న సామాజిక అంతరాన్ని తగ్గించి అతడు తమ కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ బైక్ను ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క రెండు సీట్ల మధ్య మీటర్ గ్యాప్ ఉంచారు.
లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించినప్పుడు, లాక్డౌన్ త్వరలో ముగియదని వారు అర్థం చేసుకున్నారు. తమ కుమార్తెను బస్సులో బడికి పంపించకూడదని నిర్ణయించుకున్నప్పుడు అందులోనుంచి పుట్టిన ఆలోచనే ఈ కొత్త సామజిక దూరాన్ని తలపించే బైక్.
MOST READ:లాక్డౌన్లో చిన్న బిడ్డ పుట్టిన రోజుకి పోలీస్ ఎస్కార్ట్, ఎక్కడో తెలుసా ?
కరోనా లాక్ డౌన్ కారణంగా తన కుమార్తెను బడికి పంపడానికి ఆలస్యం చేయకుండా ఆదా చేసిన డబ్బుతో పాత బైక్ భాగాలను కొనుగోలు చేస్తూ ఈ బైక్ రూపకల్పన ప్రారంభించాడు. ఇది బ్యాటరీల సహాయంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్. దీనికి 1.2 మీటర్లు (3.2 అడుగులు) ఇనుప రాడ్ అమర్చారు. ఇది బైక్ యొక్క పొడవును పెంచడం వల్ల సామాజిక దూరం పెరుగుతుంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత బైక్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 40 కి.మీ.
రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యంగా ఈ బైక్ వైపు చూస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ పార్థ సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఇటీవల ఒక ఇ-రిక్షా డ్రైవర్ తన రిక్షాలో ప్రయాణీకుల కోసం నాలుగు క్యాబిన్లను తయారుచేశాడు, సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యత పట్ల అందరికి అవగాహన కల్పించారు.
Image Courtesy: Technical Partha
MOST READ:ఎలక్ట్రిక్ మాస్ట్రో స్కూటర్ విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్