Just In
- 8 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 10 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 11 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 14 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హైదరాబాద్లో బీభత్సం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్; ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
భారతదేశంలో రోడ్డుప్రమాదాలు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోడ్డుప్రమాదాలు పెరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, మధ్య తాగి డ్రైవ్ చేయడం మరియు మితిమీరిన వేగం. రోడ్డు ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, లెక్కకు మించిన జనం ప్రమాదాల భారిన పడి అంగ వైకల్యులుగా మారిపోతున్నారు.
రోడ్డు ప్రమాదాల గురించి మీరు ప్రతి రోజు వార్తల్లో చదువుతున్నారు. ఇదే తరహాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..
నివేదికల ప్రకారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బుధవారం ఉదయం ఒక మెర్సిడెస్ బెంజ్ వేగంగా పాదచారుల మీదికి వెళ్ళింది. ఆ ప్రమాదంలో ఒక వృద్ధ మహిళ మృతి చెందింది. అంతే కాదు ఇందులో చాలామంది గాయపడినట్లు తెలిసింది.
ప్రమాదానికి కారణమైన మెర్సెడ్స్ బెంజ్ కారుని, ఆ కారు యొక్క యజమాని జాయ్రైడ్ కోసం బయటకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో అతనితో పాటు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడు తన కారుతో ఓల్డ్ సిటీ గుండా వెళుతుండగా కారుపై నియంత్రణ కోల్పోయాడు, కారుపై నియంత్రణ కోల్పోయిన వెంటనే అక్కడున్న ఆటోని డీ కొన్నాడు. అంతే కాకుండా ఎనిమిది మంది పాదచారులపై దూసుకెళ్లాడు.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలను బట్టి చూస్తే ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఈ ప్రమాదంలో 70 ఏళ్ల మహిళను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన 7 మంది గాయాలపాలయ్యారు.
ఈ సంఘటనలో గాయపడిన 7 మందిని హాస్పిటల్ కి తరలించారు. వీరి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన తరువాత కారు ఓనర్ మరియు అతని స్నేహితుడు అక్కడినుంచి పారిపోయారు. అయితే కారు యజమానిపై కేసు నమోదు చేశారు.
నిందుతుల కోసం షాలిబాండా పోలీసులు ఆ ప్రాంతంలో సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన కారుని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు కారణమైన కారు మెర్సిడెస్ జిఎల్-350 గా గుర్తించారు. దీని ధర దాదాపు రూ. 70 లక్షలకు పైగా వుండే అవకాశం ఉంది.
వాహనదారుల అశ్రద్ధవల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం వాహనదారుని నిర్లక్యం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. వాహనదారుడు చేసిన చిన్న తప్పిదం ఎంతోమంది జీవితాలను కుంగదీసింది. వాహదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే వారికీ వారి చుట్టుపక్కల ఉన్న వారికీ క్షేమం.