స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయబడింది. 2020 మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

ఈ లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువ వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకోలేక చాలా కష్టాలను పడుతున్నారు. పని లేకపోవడంతో లక్షలాది మంది కార్మికులు రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు మరియు దాతలు కార్మికుల సహాయానికి ముందడుగులు వేసి వారి ఆకలిని తగ్గించడానికి ఆహార వస్తు సామగ్రిని పంపిణీ చేసారు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

దేశ వ్యాప్తంగా దారుణంగా ఉన్న పరిస్థితి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. ఈ కారణంగా ఇతర నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

వలస కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైలు ఖర్చులు భరించలేని వారు కాలినడకన లేదా సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు చేరుకున్నారు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

ఈ పద్ధతిలో తమ ఇళ్లకు చేరుకున్న ముగ్గురు వలస కార్మికులు కటక్ హైవేపై వాలంటీర్ల దృష్టిని ఆకర్షించారు. వాలంటీర్లు అతనిని ప్రశ్నించారు. అతను బెంగళూరు నుండి ఒడిశాలోని బర్ధక్ జిల్లాకు తిరిగి వస్తున్నట్లు చెప్పాడు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

వాలంటీర్ల విచారణలో, ఒడిశా వలస కార్మికుడు చందన్ మరియు అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ బెంగళూరు నుండి తిరిగి వచ్చారు. లాక్ డౌన్ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అతను ఆదాయం లేకుండా ఇబ్బందుల్లో ఉన్నాడు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

ఈ కారణంగా వారు తమ స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ పట్టణానికి తిరిగి రావడానికి డబ్బు లేదు. ఈ కారణంగానే చందన్ తన భార్య మంగళ సూత్రాన్ని రూ. 15,000 అమ్మి అందులో 5000 రూపాలకు రెండు సైకిల్స్ కొనుక్కుని తన స్వగ్రామానికి తన వారితో బయలుదేరాడు.

స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ

చందన్ అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ వారు కొన్న సైకిల్స్‌పై స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సైక్లిస్టులు బెంగళూరు నుండి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంత పట్టణానికి చేరుకున్నారు. వాలంటీర్లు వారికి ఫుడ్ కిట్లు వంటివి అందించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాలనే సంక్షోభంలోకి నెట్టివేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, June 4, 2020, 14:42 [IST]
English summary
Migrant worker buys cycle by selling wife mangalsutra rides from Bangalore to Odisha. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+