Just In
- 1 hr ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 3 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- 21 hrs ago ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- 22 hrs ago నానో కంటే చిన్న కారు ఉందని మీకు తెలుసా.. టాటా మోటార్స్కు ఆ కారు చాలా ప్రత్యేకం
Don't Miss
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Movies The Goat Life Collections చరిత్ర సృష్టించిన ఆడు జీవితం.. 150 కోట్లతో గ్రేటెస్ట్ మూవీ జాబితాలో!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడింది. 2020 మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువ వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకోలేక చాలా కష్టాలను పడుతున్నారు. పని లేకపోవడంతో లక్షలాది మంది కార్మికులు రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు మరియు దాతలు కార్మికుల సహాయానికి ముందడుగులు వేసి వారి ఆకలిని తగ్గించడానికి ఆహార వస్తు సామగ్రిని పంపిణీ చేసారు.
దేశ వ్యాప్తంగా దారుణంగా ఉన్న పరిస్థితి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. ఈ కారణంగా ఇతర నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు.
MOST READ:XL 100 కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్ ప్రకటించిన టివిఎస్
వలస కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైలు ఖర్చులు భరించలేని వారు కాలినడకన లేదా సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు చేరుకున్నారు.
ఈ పద్ధతిలో తమ ఇళ్లకు చేరుకున్న ముగ్గురు వలస కార్మికులు కటక్ హైవేపై వాలంటీర్ల దృష్టిని ఆకర్షించారు. వాలంటీర్లు అతనిని ప్రశ్నించారు. అతను బెంగళూరు నుండి ఒడిశాలోని బర్ధక్ జిల్లాకు తిరిగి వస్తున్నట్లు చెప్పాడు.
MOST READ:హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !
వాలంటీర్ల విచారణలో, ఒడిశా వలస కార్మికుడు చందన్ మరియు అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ బెంగళూరు నుండి తిరిగి వచ్చారు. లాక్ డౌన్ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అతను ఆదాయం లేకుండా ఇబ్బందుల్లో ఉన్నాడు.
ఈ కారణంగా వారు తమ స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ పట్టణానికి తిరిగి రావడానికి డబ్బు లేదు. ఈ కారణంగానే చందన్ తన భార్య మంగళ సూత్రాన్ని రూ. 15,000 అమ్మి అందులో 5000 రూపాలకు రెండు సైకిల్స్ కొనుక్కుని తన స్వగ్రామానికి తన వారితో బయలుదేరాడు.
MOST READ:లాక్డౌన్ లో కొత్త వాహనం నడుపుతూ కనిపించిన M.S ధోని [వీడియో]
చందన్ అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ వారు కొన్న సైకిల్స్పై స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సైక్లిస్టులు బెంగళూరు నుండి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంత పట్టణానికి చేరుకున్నారు. వాలంటీర్లు వారికి ఫుడ్ కిట్లు వంటివి అందించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాలనే సంక్షోభంలోకి నెట్టివేసింది.