Just In
- 30 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
స్వగ్రామం చేరుకోవడానికి భార్య తాళి అమ్మిన వలస కూలీ
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయబడింది. 2020 మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ ఆకస్మిక లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ లాక్ డౌన్ కారణంగా అందరికంటే ఎక్కువ వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వచ్చిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకోలేక చాలా కష్టాలను పడుతున్నారు. పని లేకపోవడంతో లక్షలాది మంది కార్మికులు రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు మరియు దాతలు కార్మికుల సహాయానికి ముందడుగులు వేసి వారి ఆకలిని తగ్గించడానికి ఆహార వస్తు సామగ్రిని పంపిణీ చేసారు.
దేశ వ్యాప్తంగా దారుణంగా ఉన్న పరిస్థితి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది. ఈ కారణంగా ఇతర నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు.
MOST READ:XL 100 కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్ ప్రకటించిన టివిఎస్
వలస కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైలు ఖర్చులు భరించలేని వారు కాలినడకన లేదా సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు చేరుకున్నారు.
ఈ పద్ధతిలో తమ ఇళ్లకు చేరుకున్న ముగ్గురు వలస కార్మికులు కటక్ హైవేపై వాలంటీర్ల దృష్టిని ఆకర్షించారు. వాలంటీర్లు అతనిని ప్రశ్నించారు. అతను బెంగళూరు నుండి ఒడిశాలోని బర్ధక్ జిల్లాకు తిరిగి వస్తున్నట్లు చెప్పాడు.
MOST READ:హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !
వాలంటీర్ల విచారణలో, ఒడిశా వలస కార్మికుడు చందన్ మరియు అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ బెంగళూరు నుండి తిరిగి వచ్చారు. లాక్ డౌన్ రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అతను ఆదాయం లేకుండా ఇబ్బందుల్లో ఉన్నాడు.
ఈ కారణంగా వారు తమ స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. కానీ పట్టణానికి తిరిగి రావడానికి డబ్బు లేదు. ఈ కారణంగానే చందన్ తన భార్య మంగళ సూత్రాన్ని రూ. 15,000 అమ్మి అందులో 5000 రూపాలకు రెండు సైకిల్స్ కొనుక్కుని తన స్వగ్రామానికి తన వారితో బయలుదేరాడు.
MOST READ:లాక్డౌన్ లో కొత్త వాహనం నడుపుతూ కనిపించిన M.S ధోని [వీడియో]
చందన్ అతని భార్య మరియు స్నేహితుడు తఫన్ వారు కొన్న సైకిల్స్పై స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సైక్లిస్టులు బెంగళూరు నుండి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి సొంత పట్టణానికి చేరుకున్నారు. వాలంటీర్లు వారికి ఫుడ్ కిట్లు వంటివి అందించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాలనే సంక్షోభంలోకి నెట్టివేసింది.