వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ
సాధారణంగా మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, ట్రైన్ జర్నీ చాలా మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ట్రైన్స్ లో వెళ్లినా చాలా ఆసక్తిగానే ఉంటుంది. భారతదేశంలో ట్రైన్స్ అనేవి ఈ రోజు నుంచి మొదలైనవి కాదు. భారతదేశంలో రైల్వే రంగానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది.

మన దేశంలో బ్రిటిష్ వారు వదిలిపెట్టిన సంపదలో ట్రైన్స్ ఒకటి. మన దేశంలో రైళ్లు ఇతర దేశాల కన్నా కొంచెం ఆలస్యంగా వాడుకలోకి వచ్చాయి. మనకు స్వాతంత్య్రం రాకముందే బ్రిటీష్ వారు తమ అవసరాల కోసం ఈ ట్రైన్స్ మొదలు పెట్టిన సంగతి దాదాపు అందరికి తెలిసింది.

యూరోపియన్ దేశమైన హంగరీ రాజధాని బుడాపెస్ట్ నగరంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ దాదాపు 125 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. అయితే దీనికి ఇటీవల 125 వ వార్షికోత్సవం జరిపారు. మిలీనియం అండర్గ్రౌండ్ అని పిలువబడే ఈ ట్రైన్ సర్వీసును 1896 లో ప్రారంభించారు.

ఇక్కడ మిలీనియం అనే పేరు పడమర వలస వెళ్లి హంగేరిలో ఆశ్రయం పొందిన మాగియర్స్ (ప్రస్తుత హంగేరియన్లు) నేపథ్యం నుండి వచ్చిందని తెలుస్తుంది. 1896 నాటికి మాగియర్స్ హంగేరికి వచ్చి వెయ్యి సంవత్సరాలు అవుతుంది. దీనిని మిలీనియం అంటారు. లండన్లో కూడా ఇలాంటి పాత రైల్వే లైన్ ఉంది. హంగేరిలోని మిలీనియం అండర్గ్రౌండ్ ప్రపంచంలోని పురాతన రైల్వే సొరంగం.

ఈ సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ ఇప్పటికీ హంగేరియన్స్ మరియు విదేశీ పర్యాటకులు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అంతే కాకుండా ఈ మార్గాన్ని ఇప్పటికి ఉపయోగంలో ఉంచారు. 2002 లో ఈ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.

ప్రారంభ రోజులలో ఈ సొరంగ మార్గం 4 కిలోమీటర్లు వరకు ఉంది. ఆనాడు 19 వ శతాబ్దం చివరి నాటికి ఇటువంటి సాంకేతిక మైలురాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విజయంగా పరిగణించబడుతుంది. ఈ సొరంగం వెంట ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టారు.

1960 వరకు పనిచేసే 10.5 మీటర్ల బాక్స్కార్లో 46 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ట్రైన్ సర్వీస్ తాత్కాలికంగా మూసివేయబడింది. తిరిగి ఈ మహమ్మరి నివారణ తరువాత యధావిధిగా ప్రారంభంలోకి రానుంది.
Image Courtesy: albertbahn.hu


Click it and Unblock the Notifications








