Just In
- 9 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 29 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ
సాధారణంగా మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, ట్రైన్ జర్నీ చాలా మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ట్రైన్స్ లో వెళ్లినా చాలా ఆసక్తిగానే ఉంటుంది. భారతదేశంలో ట్రైన్స్ అనేవి ఈ రోజు నుంచి మొదలైనవి కాదు. భారతదేశంలో రైల్వే రంగానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది.
మన దేశంలో బ్రిటిష్ వారు వదిలిపెట్టిన సంపదలో ట్రైన్స్ ఒకటి. మన దేశంలో రైళ్లు ఇతర దేశాల కన్నా కొంచెం ఆలస్యంగా వాడుకలోకి వచ్చాయి. మనకు స్వాతంత్య్రం రాకముందే బ్రిటీష్ వారు తమ అవసరాల కోసం ఈ ట్రైన్స్ మొదలు పెట్టిన సంగతి దాదాపు అందరికి తెలిసింది.
యూరోపియన్ దేశమైన హంగరీ రాజధాని బుడాపెస్ట్ నగరంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ దాదాపు 125 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. అయితే దీనికి ఇటీవల 125 వ వార్షికోత్సవం జరిపారు. మిలీనియం అండర్గ్రౌండ్ అని పిలువబడే ఈ ట్రైన్ సర్వీసును 1896 లో ప్రారంభించారు.
MOST READ:భారత మార్కెట్లో ఈ టాప్ 5 కార్లు నిలిపివేయబడ్డాయి.. ఎందుకో తెలుసా?
ఇక్కడ మిలీనియం అనే పేరు పడమర వలస వెళ్లి హంగేరిలో ఆశ్రయం పొందిన మాగియర్స్ (ప్రస్తుత హంగేరియన్లు) నేపథ్యం నుండి వచ్చిందని తెలుస్తుంది. 1896 నాటికి మాగియర్స్ హంగేరికి వచ్చి వెయ్యి సంవత్సరాలు అవుతుంది. దీనిని మిలీనియం అంటారు. లండన్లో కూడా ఇలాంటి పాత రైల్వే లైన్ ఉంది. హంగేరిలోని మిలీనియం అండర్గ్రౌండ్ ప్రపంచంలోని పురాతన రైల్వే సొరంగం.
ఈ సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ ఇప్పటికీ హంగేరియన్స్ మరియు విదేశీ పర్యాటకులు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అంతే కాకుండా ఈ మార్గాన్ని ఇప్పటికి ఉపయోగంలో ఉంచారు. 2002 లో ఈ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
ప్రారంభ రోజులలో ఈ సొరంగ మార్గం 4 కిలోమీటర్లు వరకు ఉంది. ఆనాడు 19 వ శతాబ్దం చివరి నాటికి ఇటువంటి సాంకేతిక మైలురాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విజయంగా పరిగణించబడుతుంది. ఈ సొరంగం వెంట ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టారు.
1960 వరకు పనిచేసే 10.5 మీటర్ల బాక్స్కార్లో 46 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ట్రైన్ సర్వీస్ తాత్కాలికంగా మూసివేయబడింది. తిరిగి ఈ మహమ్మరి నివారణ తరువాత యధావిధిగా ప్రారంభంలోకి రానుంది.
MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?
Image Courtesy: albertbahn.hu