Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 11 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ
సాధారణంగా మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, ట్రైన్ జర్నీ చాలా మధురమైన అనుభూతిని అందిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ట్రైన్స్ లో వెళ్లినా చాలా ఆసక్తిగానే ఉంటుంది. భారతదేశంలో ట్రైన్స్ అనేవి ఈ రోజు నుంచి మొదలైనవి కాదు. భారతదేశంలో రైల్వే రంగానికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది.
మన దేశంలో బ్రిటిష్ వారు వదిలిపెట్టిన సంపదలో ట్రైన్స్ ఒకటి. మన దేశంలో రైళ్లు ఇతర దేశాల కన్నా కొంచెం ఆలస్యంగా వాడుకలోకి వచ్చాయి. మనకు స్వాతంత్య్రం రాకముందే బ్రిటీష్ వారు తమ అవసరాల కోసం ఈ ట్రైన్స్ మొదలు పెట్టిన సంగతి దాదాపు అందరికి తెలిసింది.
యూరోపియన్ దేశమైన హంగరీ రాజధాని బుడాపెస్ట్ నగరంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ దాదాపు 125 సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది. అయితే దీనికి ఇటీవల 125 వ వార్షికోత్సవం జరిపారు. మిలీనియం అండర్గ్రౌండ్ అని పిలువబడే ఈ ట్రైన్ సర్వీసును 1896 లో ప్రారంభించారు.
MOST READ:భారత మార్కెట్లో ఈ టాప్ 5 కార్లు నిలిపివేయబడ్డాయి.. ఎందుకో తెలుసా?
ఇక్కడ మిలీనియం అనే పేరు పడమర వలస వెళ్లి హంగేరిలో ఆశ్రయం పొందిన మాగియర్స్ (ప్రస్తుత హంగేరియన్లు) నేపథ్యం నుండి వచ్చిందని తెలుస్తుంది. 1896 నాటికి మాగియర్స్ హంగేరికి వచ్చి వెయ్యి సంవత్సరాలు అవుతుంది. దీనిని మిలీనియం అంటారు. లండన్లో కూడా ఇలాంటి పాత రైల్వే లైన్ ఉంది. హంగేరిలోని మిలీనియం అండర్గ్రౌండ్ ప్రపంచంలోని పురాతన రైల్వే సొరంగం.
ఈ సొరంగ మార్గ ట్రైన్ సర్వీస్ ఇప్పటికీ హంగేరియన్స్ మరియు విదేశీ పర్యాటకులు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అంతే కాకుండా ఈ మార్గాన్ని ఇప్పటికి ఉపయోగంలో ఉంచారు. 2002 లో ఈ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.
MOST READ:పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
ప్రారంభ రోజులలో ఈ సొరంగ మార్గం 4 కిలోమీటర్లు వరకు ఉంది. ఆనాడు 19 వ శతాబ్దం చివరి నాటికి ఇటువంటి సాంకేతిక మైలురాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విజయంగా పరిగణించబడుతుంది. ఈ సొరంగం వెంట ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టారు.
1960 వరకు పనిచేసే 10.5 మీటర్ల బాక్స్కార్లో 46 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ట్రైన్ సర్వీస్ తాత్కాలికంగా మూసివేయబడింది. తిరిగి ఈ మహమ్మరి నివారణ తరువాత యధావిధిగా ప్రారంభంలోకి రానుంది.
MOST READ:గుడ్ న్యూస్.. డ్రైవర్లకు రూ. 5000 ఆర్థిక సహాయం ప్రకటించిన గవర్నమెంట్.. ఎక్కడంటే?
Image Courtesy: albertbahn.hu