Just In
- 1 min ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 1 hr ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 3 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 5 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వృద్ధ మహిళను ఢీ కొట్టి పారిపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మితిమీరిన వేగం. అంతే కాకూండా ప్రజా రహదారులపై వాహనం నడపడానికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు వాహనం నడపడం చట్టరీత్యా నేరం. అంతే కాకూండా వీరు ప్రజా రహదారులపై వాహనం నడపకూడదు. ఒక వేళా వీరు రోడ్డుపై వాహనాలను డ్రైవ్ చేసినప్పుడు ప్రమాదాలు జరిగితే శిక్ష వారి తల్లిందండ్రులు అనుభవించాల్సి ఉంటుంది.
అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డుపైన మైనర్లు డ్రైవింగ్ చేస్తూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో స్కూటర్ పై వెళ్తున్న యువకులు రోడ్డుపై వెళ్తున్న ఒక వృద్ధ మహిళను ఢీ కొట్టారు.
వీరు ఆ మహిళను ఢీ కొట్టగానే అక్కడ నుంచి పారిపాయారు. ఈ వీడియోలో మీరు అక్కడ జరిగిన సంఘటనను చూడవచ్చు. ఈ వీడియో ప్రారంభంలో, ఒక వృద్ధ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం చూడవచ్చు. అయితే ఇదే సమయంలో ఒక స్కూటర్ పై ముగ్గురు యువకులు వేగంగా వాహనాలను అధిగమిస్తూ ఆ వృద్ధ మహిళను ఢీ కొట్టారు.
స్కూటర్ ఢీ కొట్టగానే ఆ వృద్ధ మహిళా అక్కడిక్కడే కిందకు పడిపోయింది. ఢీ కొట్టిన వారు అక్కడ ఏమి జరుగుతుందో అని కూడా గమనించకుండా అక్కడనుంచి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ స్వల్ప గాయాల నుండి కోలుకుంటుంది. స్కూటర్ రైడ్ చేసిన రైడర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశారు. మరొక వ్యక్తి ఇంకా పట్టుబడలేదు.
పోలీసులు అరెస్ట్ చేసిన ఆ యువకుల ఫోటోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. స్కూటర్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారు నిందితుల తల్లిదండ్రులు కావడం గమనార్హం. మైనర్లకు వాహనం నడిపే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతుండగా, ఈ కేసులు తిరిగి పంపబడుతున్నాయి.
గతంలో తమ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు పోలీసులు భారీగా జరిమానాలు విధించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది తల్లిదండ్రులను జైలుకు కూడా పంపారు. మైనర్లు పబ్లిక్ రోడ్లపై డ్రైవ్ చేసి ప్రమాదాలు జరిగితే బీమా పాలసీ సహాయం కూడా ఉపయోగపడదు.
గతంలో తమ పిల్లలు కార్లు మరియు బైక్లు నడపడానికి అనుమతించిన తల్లిదండ్రులను బాధ్యత వహించాలని మునిసిపాలిటీలు పోలీసులకు సూచించాయి. డ్రైవింగ్ నెర్కకోవాలని కుతూహలం ఉన్న వారు ముందు ప్రైవేట్ ప్రదేశాల్లో నడపడం నేర్చుకోవచ్చు. మైనర్లకు బహిరంగ ప్రదేశాల్లో నడపడం చట్టవిరుద్ధం. దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.