రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న అజారుద్దీన్ కారు ; తృటిలో తప్పిన ప్రమాదం
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు మహ్మమద్ అజారుద్దీన్ యొక్క కారు ఇటీవల రాజస్థాన్లోని సూర్వల్ వద్ద గల లాల్సాట్-కోట హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ఎక్కువగా దెబ్బతినింది. అయితే కారులో ఉన్న అజారుద్దీన్ మరియు అతని కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.

అజారుద్దీన్ కారులో రాజస్థాన్ లోని సుర్వాల్ గుండా వెళుతుండగా అకస్మాత్తుగా అతని కారు టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగి హైవే దగ్గర ఉన్న చిన్న డాబాను డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఫ్రంట్ సైడ్ ఎయిర్బ్యాగులు వల్ల అందులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజారుద్దీన్ కుటుంభ సభ్యులను మరొక వాహనంలో గమ్యస్థానానికి పంపడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో డాబాలోని ఉద్యోగి గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన డాబాలోని ఒక కార్మికుడిని కూడా ప్రథమ చికిత్స తర్వాత ఆసుపత్రి నుండి విడుదల చేశారు.

మహమ్మద్ అజారుద్దీన్ తన కుటుంబంతో కలిసి రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్ లో గడపడానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవింగ్ చేసేటప్పుడు కారు యొక్క చక్రం ప్రమాదానికి గురైతే కారులో ఉన్న వారి ప్రాణాలకే ప్రమాదం. సంఘటన జరిగిన తర్వాత ఆ కారులో కొన్ని లోపాలు కూడా ఉన్నట్లు గుర్తించబడింది. అయితే ఇప్పటికే ఆ కారు చాలా సార్లు సర్వీస్ చేసినప్పుడు చక్రాలను సరిగ్గా అమర్చారం మర్చిపోతారు.

సర్వీస్ సెంటర్ లో ఈ విధంగా జరిగితే అనుకోను ప్రమాదాలు జరుగుతాయి. అజారుద్దీన్ కారు కూడా ఈ విధంగా ప్రమాదానికి గురై ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా, కారును సర్వీస్ నుంచి తిరిగి మనం తీసుకునేటప్పుడు, సర్వీస్ చేసిన వ్యక్తి నుంచి ఖచ్చితమైన సమాచారం పొందాలి. కారుని సవీకరించిన తర్వాత కూడా అందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని టెస్ట్ చేయడం మంచిది.

సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్లలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కారులో అప్పుడప్పుడు విడి భాగాలు మరియు స్క్రూలు వాదులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా జరిగినప్పుడు కారునుంచి కచ్చితంగా శబ్దం వస్తుంది. ఆ సమయంలో ఈ సమస్యను గమనించి పరిష్కరించాలి. అప్పుడే అనివార్యంగా జరిగే ప్రమాదాలు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.

భారతీయ రోడ్లపై ప్రతిరోజూ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో ఎక్కువమంచి గాయపడుతున్నారు అంతే కాకుండా కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో రోడ్డుప్రమాదాల వల్ల సుమారు 1.50 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక ప్రమాదాలు జరిగే దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.

రోడ్డుప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు అనుకోని సంఘటనల వల్ల కూడా అప్పుడప్పుడు భయంకర ప్రమాదాలు జరుగుతాయి. కావున వాహనదారులు వీలైనంతవరకు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications








