Just In
- 6 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
Don't Miss
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా; థార్ ఎస్యూవీ పొందిన మహ్మద్ సిరాజ్
ఇండియన్ క్రికెట్ టీమ్ 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంచి పర్ఫామెన్స్ చూపించిన ఆరుగురు క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.
ఇటీవల టి. నటరాజన్ మహీంద్రా థార్ డెలివరీ పొందాడు. అయితే ఇప్పుడు మహ్మద్ సిరాజ్ కూడా మహీంద్రా థార్ పొందారు. మహ్మద్ సిరాజ్ ఇటీవల సోషల్ మీడియాలో థార్ డెలివరీ చేస్తున్న ఫోటోలను పంచుకోవడమే కాకుండా, ఆనంద్ మహీంద్రా కు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
థార్ డెలివరీ చేసుకున్న తరువాత టి నటరాజన్ తన సంతకం చేసిన టి షర్టును ఆనంద్ మహీంద్రాకు గిఫ్ట్ గా పంపారు. ప్రస్తుతం టి.నటరాజన్ మరియు మహమ్మద్ సిరాజ్ థార్ డెలివెరీ చేసుకున్నారు. మిగిలిన ఆటగాళ్లకు ఈ ఎస్యూవీ చేరిందా లేదా అనేదాని గురించి స్పష్టమైన సమాచారం లేదు.
MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే
భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను, కొత్త ఆటగాళ్లను సిరీస్ చేయడానికి ప్రోత్సహించదానికే ఈ మహీంద్రా థార్ ఎస్యూవీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతోందని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆటగాళ్లను ఉత్సాహపరచడానికి ఈ విధానం చాలా ఉపయోగపడుతుంది.
మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీ నుండి వచ్చిన లైఫ్ స్టైల్ ఎస్యూవీ. ఈ ఎస్యూవీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత అద్భుతమైన స్పందనను పొందింది. అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీలలో మహీంద్రా థార్ ఒకటి. కావున ఈ ఎస్యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ ఎక్కువయ్యాయి. ఈ కారణంగా వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది.
MOST READ:భర్త ఇచ్చిన గిఫ్ట్కి కన్నీళ్లు పెట్టుకున్న భార్య.. ఇంతకీ ఏమిచ్చాడో తెలుసా?
కొత్త మహీందర్ థార్ ఎఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది. దీని ఎఎక్స్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్లలో మాత్రమే మాన్యువల్ గేర్బాక్స్తో ప్రవేశపెట్టబడింది మరియు పెట్రోల్ ఇంజిన్లో ఆటోమేటిక్ గేర్బాక్స్తో మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్తో డీజిల్ అందుబాటులో ఉంది.
ఇది కొత్త పెట్రోల్ మరియు అప్గ్రేడ్ డీజిల్ ఇంజిన్తో పరిచయం చేయబడింది. ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక దాని 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. 2021 బెంట్లీ బెంటాయిగా & న్యూ ఫ్లయింగ్ స్పర్ ఇప్పుడు బెంగళూరులో
ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. తొలిసారిగా థార్ పెట్రోల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టం స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది. ఇది దేశంలో చౌకైన ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఎస్యూవీ.