40 కి పైగా సూపర్‌ కార్లను సీజ్‌ చేసిన పోలీసులు.. షాక్‌లో యజమానులు, ఒక్కో కారు ధర రూ. కోట్ల పైమాటే.!!

ముంబయిలో 40కి పైగా సూపర్‌ లగ్జరీ కార్లను ముంబయి పోలీసులు సీజ్ చేశారు. సీజ్‌ చేసిన ఒక్కో కారు మోడల్ ధర రూ. కోట్లలోనే ఉంటుంది. అసలు ఇంత ఖరీదైన కార్లను పోలీసులు సీజ్‌ చేయడానికి కారణాలేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి..

దేశవ్యాప్తంగా జనవరి 26న రిపబ్లిక్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అట్టహాసంగా వేడుకలు జరిపాయి. అదేవిధంగా ముంబయికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ సూపర్, స్పోర్ట్స్(Super Cars Rally in Mumbai) కార్లతో మహానగరంలో ర్యాలీకి ప్లాన్‌ చేసింది.

Super-Cars-Rally-in-Mumbai-Police-Seized

ఈ సూపర్, స్పోర్ట్స్ కార్ల ర్యాలీలో 40కి పైగా సూపర్ మరియు రేర్ కార్లు పాల్గొన్నాయి. కాగా ఈ కార్లను తాజాగా ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సీజ్ చేసిన ఒక్కో కారు మోడల్ విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని జనం అనుకుంటున్నారు. వీటి ధరలను చూస్తే ఈ కార్లన్నీ బాగా ధనవంతులకు చెందినవిగా తెలుస్తోంది.

అలాంటి సూపర్‌ రిచ్‌ కార్లను ఎలాంటి సందేహం లేకుండా పోలీసులు సీజ్‌ చేశారు. అయితే పోలీసులు ఇలాంటి చర్యకు పాల్పడటానికి ముఖ్య కారణం.. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి లేకపోవడమే. శాంతి భద్రతల దృష్ట్యా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు ముంబలు ఇలాంటి కార్యక్రమాలకు నిషేధం విధించారు.

ముంబయి నగర పోలీసులు నిషేధం విధించినప్పటికీ.. సూపర్ కార్ల యజమానులు ముంబయిలో ర్యాలీని నిర్వహించేందుకు యత్నించారు. ఈ కారణంగానే ముంబయి పోలీసులు ర్యాలీలో పాల్గొన్న అన్ని వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. వాటిని సీజ్‌ చేశారు. ముందుగానే పోలీసులకు సమాచారం అందడంతో వారు ఈ చర్యలు చేపట్టారు.

ర్యాలీలో భాగంగా ముంబయిలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ నుంచి ప్రారంభమై ఇటీవల ప్రారంభించబడిన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ద్వారా ప్రయాణించి మళ్లీ జియో వరల్డ్ డ్రైవ్ మాల్ వద్ద ముగిసేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే వాహనాలు ర్యాలీని ప్రారంభించకముందే పోలీసులు చర్యలు చేపట్టి.. దాదాపు 41 లగ్జరీ వాహనాలను సీజ్‌ చేశారు.

వాహనాలను సీజ్‌ చేయడమే కాకుండా 43 మందిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఈవెంట్ ఆర్గనైజర్ కూడా ఉన్నారు. పోర్షే, లంబోర్ఘిని, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ మరియు ఆడి వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ప్రముఖ సూపర్‌కార్ మోడల్‌లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. స్వాధీనం చేసుకున్న కార్ల విలువ రూ. కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

అటువంటి లగ్జరీ సూపర్‌ కార్లను పోలీసులు సీజ్‌ చేయడం వాహన ప్రియులను బాధించింది. స్వాధీనం చేసుకున్న కార్లలో ఎక్కువ భాగం బాంద్రా, ఖార్ మరియు అంధేరి ప్రాంతాలకు చెందిన వారివిగా పోలీసులు గుర్తించారు. కాగా పోలీసుల చర్యను నిరసిస్తూ సూపర్ కార్ల యజమానులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇలా నిషేధాజ్ఞలు జారీ చేశారని తమకు తెలియదని, బహిరంగంగా ఉత్తర్వులు జారీ చేయలేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొంతమంది సూపర్ కార్ యజమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ.. ఈ సూపర్‌ కార్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.

అన్ని వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేకించి, స్వాధీనం చేసుకున్న వాహనాల వెనుక ఏదైనా నేర నేపథ్యం ఉందా? అలాగే, ఏదైనా సవరణ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీంతో న్యాయస్థానాల ఆదేశాల మేరకు.. ఉల్లంఘనకు అనుగుణంగా ఆయా వాహనాలకు జరిమానా విధించి, ఆపై వాహనాలను యజమానులకు అప్పగిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2024, 9:33 [IST]
English summary
More than 40 super cars rally in mumbai police seized all vehicles and filed a case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+