MotoGP Bharat అహ్మదాబాద్లో 500 మంది రైడర్లతో ఉత్సాహంగా మోటో జీపీ భారత్ సిటీ టూర్..
భారత్లో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న మోటో జీపీ భారత్(MotoGP Bharat) ఈవెంట్కు సంబంధించి సిటీ టూర్ దేశవ్యాప్తంగా గ్రాండ్గా జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్లో మోటో జీపీ భారత్కు స్వాగతం పలుకుతూ యువతీయువకులు ఉత్సాహంగా రైడ్లో పాల్గొన్నారు. తాజాగా సిటీ టూర్ అహ్మదాబాద్కు చేరుకుంది.
భారత్లో మోటో జీపీ ఈవెంట్కు స్వాగతం పలికేందుకు యువ రైడర్లు ఉత్సాహంగా రైడ్లో పాల్గొంటున్నారు. మోటో జీపీ భారత్ సిటీ టూర్.. గత ఆదివారం(జూలై 30) అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIM) క్యాంపస్కు చేరుకుంది. దాదాపు 500 మంది రైడర్లు ఈ రైడ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

మోటో జీపీ భారత్ సిటీ టూర్ అహ్మదాబాద్ IIM కు చేరుకోవడంతో అక్కడ అద్భుతమైన బైకింగ్ దృశ్యం కనిపించింది. IIM క్యాంపస్లో రైడర్లు బైక్లతో విన్యాసాలు చేశారు. ఇంకా బ్యాండ్ మ్యూజిక్ షో ఈవెంట్కు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిపుణులైన బైకర్లు తమ సాహసోపేతమైన ట్రిక్స్ మరియు నైపుణ్యాలను తమ బైక్లపై ప్రదర్శించడంతో ప్రేక్షకులు థ్రిల్కు గురయ్యారు.
సిటీ టూర్లో భాగంగా అహ్మదాబాద్కు రావడం పట్ల మోటో జీపీ భారత్ ప్రమోటర్లు హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక నగరం అహ్మదాబాద్కు రావడం సంతోషంగా ఉందని ఫెయిర్ స్ట్రీట్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిటీ టూర్స్ హెడ్ శ్రీ వాస్తవ అన్నారు. అహ్మదాబాద్లో గతంలో ఎన్నో ఐకానిక్ స్పోర్ట్స్ ఈవెంట్లు జరిగాయన్నారు.
ఈ కార్యక్రమం అహ్మదాబాద్ మరియు రాష్ట్రంలోని రైడింగ్ ఔత్సాహికుల మధ్య స్నేహాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీ వాస్తవ పేర్కొన్నారు. భారత్ మోటో జీపీ గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్ గురించి దేశవ్యాప్తంగా తెలియజేయడానికి ఔత్సాహిక రైడర్లను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇంకా ఈవెంట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ రైడ్ అహ్మదాబాద్ బైకింగ్ కమ్యూనిటీ ఉత్సాహం మరియు శక్తిని ప్రదర్శించడమే కాకుండా ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగే బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో మోటో జీపీ భారత్ రేసు ఎడిషన్ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కలిగిస్తుంది. అందుకోసం విజేతలను ఎంపిక చేయడానికి ఫ్రెష్ ఫేస్ మరియు మోటోఫ్లూయెన్సర్ పోటీలను నిర్వహించింది.
ఈవెంట్లో యువతులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్రెష్ ఫేస్ మరియు మోటోఫ్లూయెన్సర్ పోటీల్లో ఔత్సాహికులు పోటీపడటంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ ఈవెంట్కు అధికారిక ఎనర్జీ డ్రింక్ పార్టనర్గా రెడ్ బుల్ పనిచేయడంతో వారి ఉత్సాహం మరింత పెరిగింది.
భారత్ మోటో జీపీ సిటీ టూర్లో భాగంగా 'రోడ్లు రైడింగ్ కోసం- ట్రాక్లు రేసింగ్ కోసం' అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా మహిళా రైడర్లను ప్రోత్సహించడంతో పాటు వారికి మద్దతుగా నిలుస్తున్నట్లు స్పష్టం చేసింది. అహ్మదాబాద్ తర్వాత మోటో జీపీ భారత్ సిటీ టూర్ దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో జరగనుంది. MotoGP భారత్ తదుపరి సిటీ టూర్ ఆతిథ్య రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో జరగనుంది.
ఢిల్లీలో సెప్టెంబర్లో జరిగే రేస్ వారాంతంలో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఇందులో పాల్గొనేవారు సెప్టెంబరులో 22 నుంచి 24 వరకు ఐకానిక్ బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించే రైడ్లో పాల్గొంటారు. ఈ ఈవెంట్ MotoGP భారత్ అభిమానులు, రైడర్లకు థ్రిల్ మరియు ఉత్సాహాన్ని ఆస్వాదించడానికి ఒక గొప్ప అవకాశం. ఇది బైకింగ్ కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి అభిరుచి మరియు ఉత్సాహాన్ని పంచుకోవడానికి కూడా ఒక మార్గంగా నిలుస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు అధునాతనమైన మోటర్బైక్ రేసింగ్ను భారత్కు తీసుకురావడంతో యువకులు మరియు ప్రతిభావంతులైన రైడర్లు వారి నైపుణ్యాలు, సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి మోటో జీపీ భారత్ వేదికగా నిలుస్తుంది. భారత్ యొక్క విజన్ను ఈ ఈవెంట్ ప్రదర్శించింది. ఈ ఈవెంట్ రోడ్డు భద్రత మరియు బాధ్యతాయుతమైన రైడింగ్ యొక్క ప్రాముఖ్యతను, అలాగే మహిళా రైడర్ల సాధికారతను కూడా హైలైట్ చేసింది.


Click it and Unblock the Notifications








