రాంచీలో సూపర్బైక్ షోరూమ్ను ఓపెన్ చేయనున్న ధోనీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సూపర్బైక్లు అంటే చాలా ఇష్టమన్న సంగతి మనందరికీ తెలిసినదే. ధోనీ తన సూపర్బైక్ ప్యాషన్ను ఇప్పుడు కొత్త మార్గంలో చూపించనున్నాడు. అదేంటంటే, ఎమ్ఎస్ ధోనీ ఇప్పుడు తన స్వగ్రామం రాంచీలో ఓ సూపర్బైక్ షోరూమ్ను ప్రారంభించనున్నాడట.
అంతేకాకుండా, ఎమ్ఎస్ ధోనీ రాంచీలో ఓ షాపింగ్ మాల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షాపింగ్ మాల్ కోసం ప్లాన్ కూడా సిద్ధమైంది, దీని అనుమతుల కోసం అతను మున్సిపల్ కార్పోరేషన్ను ఆశ్రయించినట్లు సమాచారం.

మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ధోనీ ఓ షాపింగ్ కాంప్లెక్స్ను రిజిస్టర్ చేయించి, బోర్ వెల్ కోసం అనుమతి కోరారరని, అందుకు కావల్సిన అనుమతులను తాము మంజూరు చేశామని వారు తెలిపారు.
రాంచీలోని హైదల్ ప్రాంతంలో ఓ 10 అంతస్థుల షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించేందుకు ధోనీ ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాంప్లెక్స్ లోనే ధోనీ ఓ సూపర్బైక్ షోరూమ్ను కూడా ప్రారంభించనున్నారు. ధోనీ వద్ద ఇప్పటికే దాదాపు 28కి పైగా సూపర్బైక్లు ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








