Just In
- 4 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పోలీసులు సీజ్ చేసిన మిలటరీ టైప్ మహీంద్రా స్కార్పియో; కారణం ఇదే
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులకు ఇష్టమైన వాహనం మహీంద్రా యొక్క స్కార్పియో. ఎక్కువ మంది సాహసయాత్రలు చేసే వారికీ ఆఫ్ రోడింగ్ సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. మహీంద్రా స్కార్పియో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా ప్రసిద్ధి పొందింది.
ఇదిలా ఉండగా ఇటీవల ముంబై నగర పోలీసులు మహీంద్రా స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇంతకీ పోలీసులు ఈ మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఎందుకు స్వాధీనం చేసుకున్నారు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాన్నీ గురించి మరింత సమాచారం ఆ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్న మహీంద్రా స్కార్పియో కారు చూడటానికి మిలటరీ దళాలు ఉపయోగించే కారులాగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ముంబై పోలీసులు మహీంద్రా స్కార్పియో కారును స్వాధీనం చేసుకున్నారు.
ముంబై పోలీసుల స్వాధీనం చేసుకున్న ఈ కారు చూడటానికి మిలటరీ వాహనంలా కనిపించే ఒక వ్యక్తిగత వాహనం. ఈ డిజైన్ సైనిక వాహనాలపై మాత్రమే ఉపయోగించాలనే నియమం కూడా ఉంది. కావున ఇతర వ్యక్తిగత వాహనాలపై కానీ ఇతర కంపెనీ వాహనాలపై కానీ ఉపయోగించకూడదు.
ఒక్క మాటలో చెప్పాలంటే మిలటరీ దళాలను వ్యక్తిగతం చేసే కలర్ మరియు డిజైన్ అనేవి భారత సైన్యం తప్ప ఇతరులు ఉపాయోగించకూడదు. అయితే ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న మహీంద్రా స్కార్పియో ఈ నిబంధనను ఉల్లంఘించింది.
వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు మిలిటరీ లుక్తో స్కార్పియో కారును నడుపుతున్న కొంతమంది యువకులను ముంబై పోలీసులు కనుగొన్నారు. అయితే ఈ మహీంద్రా స్కార్పియో కారులో ఎవరూ మిలటరీ యూనిఫాం ధరించలేదు. అయితే అనుమానంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
విచారణ సమయంలో, కారు మిలటరీ డిజైన్ కలిగిన వ్యక్తిగత వాహనం అని కనుగొనబడింది. ఆలివ్ గ్రీన్ భారతదేశంలో సైనిక వాహనాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. ఈ కలర్ ప్రత్యేకంగా దేశ భద్రతా దళాలకు ప్రత్యేకించబడింది. ముందు చెప్పినట్లుగా, పబ్లిక్ మరియు ఇతర సంస్థలు ఈ రంగును ఉపయోగించకుండా నిషేధించబడ్డాయి. ఈ నియమం అందరికీ వర్తిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ తన బైక్లలో కొన్నింటిని బాటిల్ గ్రీన్ కలర్ లో అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతి చేస్తుంది. ఈ వాహనాలు భారతదేశంలో తయారు చేయబడతాయి మరియు విదేశాలకు ఎగుమతి చేయబడతాయి. కానీ ఈ వాహనాలు భారతదేశంలో అమ్మకానికి లేవు.
భారతదేశంలో, మహీంద్రా అండ్ మహీంద్రా, జావా మరియు జీప్ కంపెనీలు ప్రభుత్వ ఆమోదంతో ఆలివ్ గ్రీన్ రంగు వాహనాలను విక్రయిస్తాయి. ఈ వాహనాలు మిలిటరీ వాహనాల కంటే కొంచెం భిన్నమైన రూపాన్ని కలిగి ఉండటం గమనార్హం. సైనిక వాహనం వలె కనిపించే కార్లు లేదా బైకులు సరైన అనుమతి ఉంటేనే ఉపయోగించాలి.
ఇలాంటి వాహనాలకు కూడా సరైన సరైన లైసెన్స్ మరియు డాక్యుమెంట్లు లేనట్లయితే వాటిని పోలీసులు సీజ్ చేయవచ్చు. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు మాడిఫై అవుతున్నాయి. అయితే నిబంధనలకు వ్యతిరేఖంగా తయారైన వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న స్కార్పియో కారు యజమానులకు భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది.