Just In
- 1 hr ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 3 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 5 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 8 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?
భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతూ విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంతో పోల్చితే, ఉత్తర భారతదేశంలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య మరియు మరణాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.
ఇటువంటి కష్ట సమయంలో ఉదారంగా మరియు స్వచ్చందంగా సేవలను అందించడానికి కొంతమందివ్యక్తులు బయటకు వస్తున్నారు. కరోనావైరస్ బారిన పడిన ప్రజలకు ప్రధాన సమస్య సాధారణంగా శ్వాస తీసుకోవడం. కావున అలాంటి వారికి కృత్రిమంగా మెడికల్ ఆక్సిజన్ అవసరం.
భారతదేశంలో గత కొన్ని రోజులుగా, కరోనా రోగులు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. ఈ సమయంలో టాటా గ్రూప్, రిలయన్స్ కంపెనీలు ఆక్సిజన్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్ల తయారీకి ముందుకు వచ్చాయి. కంపెనీలు తమవంతు సహాయం చేస్తుండగా, ముంబై మహానగరంలో ఒక వ్యక్తి స్వచ్చందంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాడు.
MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్యూవీలను కొనేసింది.. ఎందుకంటే?
నివేదికల ప్రకారం ముంబైలోని మలాడ్లో నివసిస్తున్న షహనావాజ్ తన ఫోర్డ్ ఎస్యూవీని కొన్ని నెలల క్రితం రూ. 22 లక్షలకు విక్రయించి, ఆ డబ్బును 160 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ అవసరమైన వారికి సకాలంలో పంపిణీ చేయబడతాయి.
షహనావాజ్ దీని కోసం ఒక టీమ్ మరియు హెల్ప్లైన్ నంబర్ వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. షహనావాజ్ బృందం గత సంవత్సరం నుండి 4,000 మందికి పైగా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేశారు. అంతే కాకుండా, వారు ఆక్సిజన్ సిలిండర్లను ఎలా ఉపయోగించాలో కూడా ప్రజలకు వివరిస్తున్నారు.
MOST READ:కరోనా టైమ్లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే
షహనావాజ్ ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడం వెనుక ఒక విషాద కన్నీటి గాథ ఉంది. షహనావాజ్ స్నేహితుడి భార్య గత సంవత్సరం ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించింది. ఈ సంఘటన షహనావాజ్ను బాగా కలవరపెట్టింది.
ఈ కారణంగా, షహనావాజ్ అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరగడం షహనావాజ్ను మరింత దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్ పొందడానికి ప్రతిరోజూ 500 నుండి 600 మంది తనకు ఫోన్ చేస్తున్నారని తెలిపాడు.
ఇటీవల కాలంలో బీహార్ చెందిన 'గౌరవ్ రాయ్' అనే వ్యక్తి తన మారుతి సుజుకి వాగన్ఆర్ లో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. గౌరవ్ రాయ్ ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి స్వచ్చందంగా అందిస్తున్నారు. డీఐ కోసం ఏ మాత్రం డబ్బు తీసుకోవడం లేదు.
కరోనా నేపథ్యంలో ప్రజలకు తమ వంతు సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చి రియల్ హీరోలుగా నిలుస్తున్నారు. మొన్న గౌరవ్ రాయ్, ఈ రోజు షహనావాజ్. ఏది ఏమైనా సొంత ఖర్చులతో ప్రజలకు సేవ చేయడం అనేది నిజంగా అభినందనీయం.
MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
Source: Tamil.Behindwoods